EXCLUSIVE: ఎయిటీస్.. స్వీట్ మెమోరీస్!

ప్రతిఒక్కరి జీవితంలో జ్ఞాపకాలు పదిలంగా ఉంటాయి. పెరిగి పెద్దవాళ్లైనప్పటికీ.. అలనాటి మధురమైన క్షణాలను స్మరించుకుంటూ..

  • Written By:
  • Updated On - April 14, 2022 / 05:43 PM IST

ప్రతిఒక్కరి జీవితంలో జ్ఞాపకాలు పదిలంగా ఉంటాయి. పెరిగి పెద్దవాళ్లైనప్పటికీ.. అలనాటి మధురమైన క్షణాలను ఎప్పుడూ స్మరించుకుంటూ.. సంతోష పడిపోతుంటారు. నిత్యం లైట్స్, కెమెరాల మధ్య బిజీ బిజీగా ఉండే స్టార్స్ మనసు కూడా కాసింత రిలాక్స్ కావాలని కోరుకోవడం సహజం. అందుకే 1980 కాలం నాటి హీరోహీరోయిన్లు క్రమం తప్పకుండా ’గెటు టు గెదర్’ పార్టీస్ ఏర్పాటు చేసుకుంటుంటారు. దక్షిణ భారత సినీ తారలు తమ గత అనుభవాలను, జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటారు. చిరంజీవి, ఖుష్బూ, రజనీకాంత్ లాంటివాళ్లు సైతం తమకు నచ్చినట్టుగా గడుపుతుంటారు. తాజాగా వాట్సాప్ గ్రూప్ ద్వారా మధుర క్షణాలను గుర్తుకు తెచ్చుకుంటున్నారు.

‘‘80 ల గ్రూప్ మమ్మల్ని ఐక్యంగా ఉంచుతోంది. ప్రతిరోజూ  గ్రూప్ లో 100 మెసేజ్ లు ఫార్వర్డ్ అవుతాయి. మేం ఫోటోలు, ఇతర ఆసక్తికర విషయాలను షేర్ చేస్తాం. చిరంజీవి వాట్సాప్‌లో లేరు, కానీ ఇప్పటికీ, మేము అందరం టచ్‌లో ఉన్నాం’’ అని ఇటీవల చిరంజీవిని కలిసిన ఖుష్బు సుందర్ వెల్లడించారు.  సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కలిసి అన్నాత్తేలో చివరిగా కనిపించిన ప్రముఖ నటి ఖుష్బు మరిన్ని తమిళ చిత్రాలు చేయాలని ఎదురుచూస్తోంది.  “నేను తమిళంలో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నాను, కానీ ప్రాజెక్టులు ఫైనల్ కాలేదు. అయితే, 28 సంవత్సరాల తర్వాత రజనీ సర్‌తో కలిసి పనిచేయడం అద్భుతమైన అనుభవం. అతను అస్సలు మారలేదు. రజనీ చాలా చిన్న పిల్లవాడిగా కనిపిస్తాడు. కానీ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. ఈ లక్షణాలే రజనినీ లెజెండ్‌గా మార్చాయి” మరో నటి తన అనుభావాన్ని పంచుకుంది.

ప్రపంచంలోనే ప్రత్యేకంగా జరుపుకుంటున్న ఈ తారల గెట్‌టు గెదర్ కార్యక్రమానికి మూల కారణం నటి సుహాసిని, విజి ప్రియదర్శన్ నట. ఈ ఐడియా వారిదేనట. వీరు ఈ తరహా తారల పార్టీకి 2009లోనే శ్రీకారం చుట్టారు. అప్పట్నుంచీ ఈ హీరోహీరోయిన్లు తరచుగా పార్టీస్ చేసుకుంటూ తమదైన స్టయిల్ లో ఎంజాయ్ చేస్తుంటారు.