Tollywood: మరోసారి భార్యతో కలిసి సమ్మర్ వెకేషన్ కు రెడీ అయిన చిరంజీవి?

  • Written By:
  • Publish Date - March 29, 2024 / 12:29 PM IST

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ క్యూట్ కపుల్ మెగాస్టార్ చిరంజీవి కొణిదెల సురేఖ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ లో ఉన్న క్యూట్ కపుల్స్ లో ఈ జంట కూడా ఒకరు. అయితే సురేఖ చాలా వరకు సినిమా ఇండస్ట్రీకి అలాగే సోషల్ మీడియాకు దూరంగా ఉంటారు. కేవలం పండుగ ఈవెంట్లలో మాత్రమే అలా అలా కనిపిస్తూ ఉంటారు. కానీ ఇది మొన్నటి వరకు ఎందుకంటె ఇటీవల ఆమె, కోడలు ఉపాసన కలిసి ఫుడ్ బిజినెస్ ని మొదలు పెట్టిన విషయం తెలిసిందే.

ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ఫ్యామిలీకి అంతే ప్రాధాన్యత ఇస్తారు. ఆయన షూటింగ్స్, ఇతర ఈవెంట్స్ తో బిజీగా ఉన్నప్పటికీ ఫ్యామిలీ మెంబర్స్ తో గడిపేందుకు కచ్చితంగా సమయం కేటాయిస్తుంటారు. ఏ మాత్రం సమయం దొరికినా వెకేషన్ కు వెళ్లే చిరంజీవి ఈసారి సమ్మర్ ట్రిప్ కు రెడీ అయ్యాడు. ఇటీవల తన భార్యతో కలిసి వెకేషన్ కు వెళ్లి వచ్చిన చిరు ఇప్పుడు మళ్ళీ తన భార్యతో కలిసి వెకేషన్కు వెళ్లడానికి సిద్ధమయ్యారు. అయితే ఇప్పటి వరకు షూటింగ్స్ తో బిజీగా ఉన్న చిరంజీవి మెగా బ్రేక్ తీసుకోవాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఎప్పుడూ యూఎస్ఏ కు వెళ్లే చిరు ఈసారి మాత్రం మరో కంట్రీకి వెళ్లాలనుకుంటున్నాడు.

అయితే ఇటీవల ఒక పెళ్లికి హాజరయ్యారు చిరంజీవి. తన కుటుంబంతో కలిసి ఏప్రిల్ లో యూరోప్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. యూరోపియన్ దేశాలను సందర్శించిన ఆయన ఈసారి ఎప్పుడూ చూడని కొన్ని ప్రదేశాలను చూడాలనుకుంటున్నారట. కాగా చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్ లో విశ్వంభర యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కోసం మెగాస్టార్ చిరంజీవి నిన్నటి వరకు కష్టపడ్డారు. ఇక హరీష్ శంకర్ తదుపరి చిత్రం కథ గురించి కూడా ఆయన చర్చిస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తన కూతురు సుస్మిత కొణిదెల, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా మూవీని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.