Tollywood: టాలీవుడ్ టాప్ హీరోల కొత్త చిత్రాల సందడి

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న మూవీ విశ్వంభర. ఈ చిత్రానికి మల్లిడి వశిష్ట్ దర్శకత్వం వహిస్తున్నాడు. యు.వీ క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందుతోన్న విశ్వంభర సినిమా ఇటీవల సెట్స్ పైకి వచ్చింది. ఇందులో చిరంజీవి, త్రిష కూడా జాయిన్ అయ్యారు.

Tollywood: మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న మూవీ విశ్వంభర. ఈ చిత్రానికి మల్లిడి వశిష్ట్ దర్శకత్వం వహిస్తున్నాడు. యు.వీ క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందుతోన్న విశ్వంభర సినిమా ఇటీవల సెట్స్ పైకి వచ్చింది. ఇందులో చిరంజీవి, త్రిష కూడా జాయిన్ అయ్యారు. అయితే.. చిరంజీవి ఇటీవల అమెరికా వెళ్లడం వలన షూటింగ్ కి బ్రేక్ పడింది. ఇప్పుడు అమెరికా నుంచి చిరు వచ్చారు. తాజా షెడ్యూల్ లో చిరు జాయిన్ అయ్యారు. హైదరాబాద్లోనే విశ్వంభర షూటింగ్ జరుగుతోంది. చిరంజీవి పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

బాలయ్య విషయానికి వస్తే.. బాబీ డైరెక్షన్ లో మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా గత కొన్ని రోజులుగా హైదరబాద్ లో షూటింగ్ జరుపుకుంది. అయితే.. బాలయ్య ఈ సినిమా షూటింగ్ కి రెండు నెలలు గ్యాప్ ఇచ్చారు. ఏపీ ఎన్నికల అనంతరం మళ్లీ ఈ మూవీ షూట్ లో జాయిన్ అవుతారు. ఈ సినిమాను కుదిరితే దసరాకి విడుదల చేయాలి అనేది ప్లాన్. ఇక నాగార్జున విషయానికి వస్తే.. నా సామి రంగ సక్సెస్ తర్వాత ఫుల్ జోష్ లో ఉన్నారు. ప్రస్తుతం ధనుష్ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. సుబ్బు అనే కొత్త దర్శకుడుతో సినిమా చేయనున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. త్వరలోనే నాగ్ కొత్త సినిమాను అనౌన్స్ చేయనున్నారు.

వెంకీ విషయానికి వస్తే.. సైంధవ్ సినిమా నిరాశపరచడంతో కొత్త సినిమాను ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. అనిల్ రావిపూడితో వెంకీ సినిమా ఫిక్స్ అని సమాచారం. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించనున్నారు. భగవంత్ కేసరి సినిమా తర్వాత అనిల్ రావిపూడి చిరంజీవితో సినిమా చేయాలి అనుకున్నాడు కానీ.. కుదరలేదు. ఇప్పుడు వెంకీతో మూవీ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఇలా ఆ నలుగురు టాప్ హీరోలు సినిమాలతో బిజీగా ఉన్నారు.

Also Read: Lok Sabha Polls 2024: సార్వత్రిక ఎన్నికల్లో యువత ప్రాధాన్యత