Puneeth Rajkumar: పునీత్ రాజ్ కుమార్’ “జేమ్స్” సినిమాకు చీఫ్ గెస్ట్ లుగా ‘చిరు, ఎన్టీఆర్’ !

  • Written By:
  • Updated On - February 27, 2022 / 10:43 AM IST

కన్నడ పవర్ స్టార్, దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’. ఈ సినిమా మార్చ్ 17న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ‘జేమ్స్’ ను కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు మేకర్స్.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే… ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ లు చీఫ్ గెస్ట్ లుగా రానున్నారని. కాగా, ‘జేమ్స్’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ను మార్చ్ 6న నిర్వహించాలని చిత్రబృదం సన్నాహాలు చేస్తోంది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ లను ముఖ్య అతిధులుగా ఆహ్వానించారని… దీనికి వీరిద్దరూ ఓకే చెప్పారని సమాచారం. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరోవైపు దివంగత నటుడు, మంచి మనిషిగా పేరుతెచ్చుకున్న పునీత్ రాజ్ కుమార్ తో అటు చిరంజీవికి, ఇటు జూనియర్ ఎన్టీఆర్ కు మంచి అనుబంధం ఉందనే విషయం అందరికీ తెలిసిందే. చిన్న వయసులోనే పునీత్ రాజ్ కుమార్ తనువు చాలించడం యావత్ సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసిన సంగతి తెలిసిందే. పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’ ఘన విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ ‘జేమ్స్’ మూవీ టీమ్ ఫ్రమ్ ‘హ్యాష్ ట్యాగ్ యు’ తెలుగు వైబ్సైట్.