Sridevi Death: శ్రీదేవి మృతిపై బోని కపూర్ సంచలన వ్యాఖ్యలు.. అసలు నిజాలివే!

శ్రీదేవి మరణంపై తొలిసారి ఆమె భర్త బోనీ కపూర్ నోరు విప్పారు. అసలు నిజం ఎంటో చెప్పేశాడు.

Published By: HashtagU Telugu Desk
Sridevi

Sridevi

Sridevi Death: అతిలోక సుందరి శ్రీదేవి దుబాయ్‌లోని బాత్‌టబ్‌లో చనిపోవడం అందరికీ తెలిసిందే. అయితే శ్రీదేవి మరణంపై అనేక ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ నేపథ్యంలో తాజాగా ఆమె భర్త బోనీ కపూర్ శ్రీదేవి మరణంపై క్లారిటీ ఇచ్చారు. బోనీ కపూర్ చివరకు ఆమె మరణం వెనుక గల కారణాల గురించి విప్పాడు. ‘ఇది సహజ మరణం కాదు.. అది ప్రమాదవశాత్తు మరణం. నేను దాని గురించి మాట్లాడకూడదని నిర్ణయించుకున్నా. ఎందుకంటే ఆ సమయంలో నేను విచారణలో ఉన్నాను. దాదాపు 24 లేదా 48 గంటల పాటు అనేక ప్రశ్నలు ఎదుర్కొన్నా.

వాస్తవానికి, భారతీయ మీడియా నుండి చాలా ఒత్తిడి ఉంది. దీంతో నేను నేను లై డిటెక్టర్ పరీక్షలు, ఇతర విచారణలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అన్ని రిపోర్టులు శ్రీదేవి ప్రమాదవశాత్తు నీటమునిగి చనిపోయిందని స్పష్టంగా పేర్కొన్నాయి’’ ఆయన ఆయన చెప్పారు. ‘‘ ఉప్పు లేకుండా భోజనం తినొద్దని వైద్యులు వారించినా తను పట్టించుకోలేదు. దానివల్ల నీరసించి పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. బీపీ సమస్యలు ఉన్నాయని, జాగ్రత్తగా ఉండమని వైద్యులు ఎంతగానో చెప్పారు. కానీ శ్రీదేవి సీరియస్‌గా తీసుకోలేదు. ఆమె మంచి ఆకృతిలో ఉండాలని, తద్వారా స్క్రీన్‌పై అందంగా కనిపించాలని కోరుకునేది. అయితే ఆమెతో నాకు పెళ్లయినప్పటి నుండి శ్రీదేవికి కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఆమెకు తక్కువ బిపి (బ్లడ్ ప్రెజర్) సమస్య ఉందని డాక్టర్ చెబుతున్నా పట్టించుకోలేదు. శ్రీదేవిది సహజ మరణం కాదు’’ అని బోనీ చెప్పాడు.

‘‘శ్రీదేవి ఆమె మరణించినప్పుడు, నాగార్జున తన సంతాపాన్ని తెలియజేయడానికి ఇంటికి వచ్చాడు. ఆమె ఒక సినిమా సమయంలో, ఆమె మళ్లీ క్రాష్ డైట్‌లో ఉందని, అలాగే ఆమె బాత్రూంలో పడి పళ్ళు విరిగిందని అతను నాకు చెప్పాడు’’ బోనీ కపూర్ వివరించాడు. ఎట్టకేలకు బోనీ కపూర్ శ్రీదేవి మరణంపై నోరు విప్పడంతో ఆయన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Also Read: MLC Kavitha: జాగృతి ఆధ్వర్యంలో21న యూకేలో బతుకమ్మ సంబరాలు

  Last Updated: 03 Oct 2023, 03:15 PM IST