Bollywood: లెజండ‌రీ కోచ్ స‌య్య‌ద్ అబ్దుల్ ర‌హీమ్ జీవిత కథతో బాలీవుడ్ మూవీ!

  • Written By:
  • Updated On - April 3, 2024 / 09:52 AM IST

Bollywood: ప్ర‌తి ఒక్క‌రూ అనుస‌రించాల్సిన అంకిత భావం, అచంచ‌ల‌మైన విశ్వాసం, ఫుట్‌బాల్ క్రీడలో వెలుగులు చాటాల‌నే త‌ప‌న‌తో ముంద‌డుగేసి, రాణించి మ‌న దేశానికి గ‌ర్వ‌కార‌ణంగా నిలిచిన లెజండ‌రీ కోచ్ స‌య్య‌ద్ అబ్దుల్ ర‌హీమ్. ఇప్పుడు ఆయన జీవిత క‌థ ఆధారంగా ఓ బాలీవుడ్ మూవీని తెర‌కెక్కుతోంది.

అమిత్ ర‌వీంద్ర‌నాథ్ శ‌ర్మ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆద‌ర్శ‌వంత‌మైన ఈ స్పోర్ట్స్ బ‌యోపిక్‌లో అజ‌య్‌దేవ్‌గ‌ణ్,  ప్రియ‌మ‌ణి, గ‌జ్‌రాయ్ రావు, బెంగాలీ యాక్ట‌ర్ రుద్ర‌నీల్ ఘోష్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. జీ స్టూడియోస్‌, బోనీ క‌పూర్‌, అరుణ‌వ జోయ్ సేన్‌గుప్తా, ఆకాష్ చావ్లా నిర్మించారు. సైవిన్ ఖుద్రాస్, రితీష్ షా స్క్రీన్ ప్లే, డైలాగులు రాశారు. ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీతాన్ని స‌మ‌కూర్చారు. మ‌నోజ్ ముంత‌షిర్ శుక్లా లిరిక్స్ రాశారు. ఈద్ సంద‌ర్భంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏప్రిల్ 10న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు మేక‌ర్స్. ఐమ్యాక్స్ వెర్ష‌న్ కూడా అదే రోజున విడుద‌ల కానుంది.

చాలా కాలంగా ఒక్క హిట్ అయినా లేకుండా ఆయ‌న కెరీర్ గ‌డ‌వ‌లేదు. సినిమా హీరోల్లో ఈ అరుదైన ఘ‌న‌త ఉన్న హీరో అజ‌య్ దేవ్‌గ‌ణ్‌. ఆయ‌న పుట్టిన‌రోజు ఇవాళ‌. అజ‌య్‌దేవ్‌గ‌ణ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మైదాన్ సెన్సేష‌న‌ల్ ఫైన‌ల్ ట్రైల‌ర్‌ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చారు. ఒక‌టా, రెండా ఎన్నెన్నో స‌వాళ్ల‌ను ఎదుర్కొన్న లెజండ‌రీ కోచ్ ఎస్‌.అబ్దుల్ ర‌హీమ్‌, ఆయ‌న ఇండియ‌న్ ఫుట్‌బాల్ టీమ్ గురించి ఈ ట్రైల‌ర్ మ‌రింత అద్భుతంగా ఆవిష్క‌రించింది. ఫుట్‌బాల్ రంగంలో మ‌న ఇండియా టీమ్… చ‌రిత్ర‌ను ఎలా తిరగ‌రాసిందో చెప్పే చిత్ర‌మే మైదాన్‌. ప్రస్తుతం ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ వచ్చింది.

కాగా రహీమ్ 1950 నుంచి 1963 వరకు దశాబ్దానికి పైగా భారత ఫుట్ బాల్ జట్టుకు కోచ్ గా పనిచేశాడు. “భారత ఫుట్ బాల్ స్వర్ణయుగం”గా పరిగణించబడే ఈ కాలంలో ఇండియాలో 1951, 1962 ఆసియా క్రీడలలో రెండు బంగారు పతకాలు సాధించింది. రహీమ్ 1909 ఆగస్టు 17న హైదరాబాద్ లో జన్మించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆయన కళాశాల పూర్వ విద్యార్థులతో కూడిన బృందానికి ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత పుట్ బాల్ క్రీడలో ఎన్నో విజయాలను అందించారాయన.