Pallavi Prashanth: రైతు బిడ్డ ముసుగులో అలాంటి పనులు చేస్తున్న పల్లవి ప్రశాంత్.. బయటపడ్డ మోసం?

  • Written By:
  • Publish Date - April 2, 2024 / 07:21 PM IST

తెలుగు బిగ్ బాస్ సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ గురించి మనందరికి తెలిసిందే. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పల్లవి ప్రశాంత్ పేరు వినిపిస్తూనే ఉంది. పల్లవి ప్రశాంత్ కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియా వైరల్ అవుతూనే ఉన్నాయి. తరచూ ఏదో ఒక విషయంతో పల్లవి ప్రశాంత్ పేరు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. అయితే ప్రశాంత్ హౌస్ లో ఉన్నప్పుడు సపోర్ట్ చేసిన వారే ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. అందుకు గల కారణం కూడా లేకపోలేదు.. హౌస్ లో ఉన్నంతవరకు ఎన్నెన్నో మాటలు చెప్పిన పల్లవి ప్రశాంత్ బయటికి రాగానే వాటిని గాలికి వదిలేసాడు.

విన్నర్ గా టైటిల్ అందుకున్న పల్లవి ప్రశాంత్ రూ. 35 లక్షలు ప్రైజ్ మనీ, ఒక కారు, డైమండ్ నెక్లెస్ గెలుచుకున్నాడు. కాబట్టి హౌస్లో ఇచ్చిన మాట ప్రకారం పల్లవి ప్రశాంత్ రూ. 35 లక్షలు పేదల రైతులకు పంచాల్సి ఉంది. అయితే బిగ్ బాస్ షో ముగిసిన మూడు నెలలు అవుతోంది. ఆ దిశగా పల్లవి ప్రశాంత్ అడుగులు వేసిన దాఖలాలు కూడా లేవు. దీంతో విమర్శలు వెల్లువెత్తాయి. గతంలో సీజన్ 2 విన్నర్ ప్రైజ్ మనీ క్యాన్సర్ రోగులకు సహాయంగా ఇస్తానని చెప్పాడు. ఆయన మాట నిలబెట్టుకోలేదనే వాదన ఉంది. పల్లవి ప్రశాంత్ కూడా మాట తప్పాడు. ఇంకెప్పుడు సహాయం చేస్తాడని విమర్శలు వినిపించాయి. అయితే ప్రాణం పోయినా మాట తప్పను.

త్వరలోనే ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తానని పల్లవి ప్రశాంత్ సోషల్ మీడియాలో స్పందించాడు. అన్న మాట ప్రకారం పల్లవి ప్రశాంత్ ఒక పేద రైతు కుటుంబానికి అండగా నిలిచాడు. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలంలో గల కొలుగూరు గ్రామానికి చెందిన రైతు కుటుంబానికి రూ. 1 లక్ష సహాయం చేశాడు. పేద రైతు, అతని భార్య మరణించడంతో పిల్లలు అనాథలు అయ్యారు. పిల్లల పేరిట లక్ష రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఒక ఏడాదికి సరిపడా బియ్యం ఇచ్చాడు. అయితే పల్లవి ప్రశాంత్ మరో సహాయం చేయలేదు. లక్ష రూపాయలు పంచి సైలెంట్ అయ్యాడు. పల్లవి ప్రశాంత్ లక్ష రూపాయలు దానం చేసి రెండు వారాలుగా పైగా అవుతోంది.

ఇంకొంత మందికి సహాయం చేసి వీడియో అప్లోడ్ చేస్తానన్న పల్లవి ప్రశాంత్ అది చేయలేదు. పల్లవి ప్రశాంత్ దాదాపు రూ. 10 లక్షలు పంచాల్సి ఉంది, కానీ ఇంత వరకు కేవలం లక్ష రూపాయలు మాత్రమే దానం చేసినట్లు వీడియో చేశాడు. పేద రైతులను గుర్తించడం పల్లవి ప్రశాంత్ కి అంత కష్టం అవుతుందా అనే సందేహాలు మొదలయ్యాయి. ఇటీవల సహాయం కోసం నా ఇంటికి రావొద్దని పల్లవి ప్రశాంత్ వీడియో పోస్ట్ చేశాడు. చూస్తుంటే పల్లవి ప్రశాంత్ అరకొరగా ఈ కార్యక్రమం పూర్తి చేసే సూచనలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా హౌస్ లో ఉన్నప్పుడు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా మాట్లాడుతుండడంతో అతనిపై నెటిజన్స్ పెదవి విరుస్తున్నారు.