Site icon HashtagU Telugu

Bellam Konda Srinivas : ఆలా చేస్తే ఇండస్ట్రీని వదిలివెళ్తా- బెల్లంకొండ శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు

Kishkindha Puri Bellamkonda

Kishkindha Puri Bellamkonda

హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sreenivas) తాను నటించిన తాజా చిత్రం ‘కిష్కింధపురి’ (Kishkindhapuri)పై పూర్తి నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమా థియేటర్‌లో మొదలైన 10 నిమిషాల తర్వాత ప్రేక్షకులు ఎవరైనా తమ ఫోన్ పట్టుకుంటే తాను సినీ పరిశ్రమను వదిలి వెళ్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. దర్శకుడు కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ చిత్రం రేడియో స్టేషన్ నేపథ్యంలో నడుస్తుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Attacks by people : నిన్న బంగ్లా, నేడు నేపాల్.. ప్రజలు తలచుకుంటే కూలిపోవడమే !!

దర్శకుడు కౌశిక్‌ పెగల్లపాటి మాట్లాడుతూ.. సినిమా కోసం 1969 నాటి పరిస్థితులను తలపించేలా భారీ సెట్‌ను నిర్మించి, వింటేజ్ ఫీల్‌ను క్రియేట్ చేశామని తెలిపారు. కథపై పూర్తి నమ్మకం ఉందని, సినిమా తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అలాగే, తన తదుపరి సినిమా కోసం రెండు కథలు సిద్ధంగా ఉన్నాయని కూడా చెప్పారు. ఈ చిత్రంలో కథ, కథనం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తాయని ఆయన అన్నారు.

అంతేకాకుండా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇండస్ట్రీలో తనకు మన అనుకునే వాళ్లు ఎవరూ లేరని, చాలా మంది ఎదురుగా బాగానే మాట్లాడి, వెనకాల మరో విధంగా మాట్లాడతారని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు సినీ పరిశ్రమలోని అంతర్గత విషయాలను వెల్లడిస్తున్నాయి. ఈ చిత్రం సాయి శ్రీనివాస్‌కు ఒక ముఖ్యమైన ప్రాజెక్టుగా భావిస్తున్నారు. ఎందుకంటే ఆయన గత చిత్రాలు ఆశించినంత విజయం సాధించలేదు. ఈ సినిమా విజయం ఆయన కెరీర్‌కు ఎంతో కీలకం కానుంది.