Anushka Shetty: వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలనుకుంటున్న అనుష్క తల్లిదండ్రులు.. అసలేం జరిగిందంటే?

తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో అత్యధిక ఫ్యాన్స్ ఫాలోయింగ్ కలి

  • Written By:
  • Publish Date - February 2, 2024 / 09:20 AM IST

తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో అత్యధిక ఫ్యాన్స్ ఫాలోయింగ్ కలిగిన హీరోయిన్స్ లో అనుష్క టాప్ ఫైవ్ లో ఉంటారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కాగా మొదట అనుష్క పూరి జగన్నథ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ హోదాను దక్కించుకుంది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో, మల్లెమాల నిర్మాణంలో వచ్చిన అరుంధతి సినిమా ఆమె సినీ కెరీర్‌ను పూర్తిగా మలుపుతిప్పింది.

ఈ సినిమాతో అనుష్క క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇక బాహుబలిలో దేవసేన పాత్ర ఆమెకు మరో మైలురాయిగా చెప్పవచ్చు. ఆ సినిమాతో ఒక్కసారిగా ప్యాన్ ఇండియా నటిగా మారింది అనుష్క. ఇది ఇలా ఉంటే హీరోయిన్ రష్మిక కు సంబందించిన కొన్ని డీప్ ఫేక్‌కు ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ విషయం తెలిసిందే.డీప్‌ ఫేక్‌ టెక్నాలజీకి తాజా బాధితురాలు రష్మిక మందన్న. ఆమెకు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి వీడియోను ఎవరో మార్ఫింగ్‌ చేసి సోషల్ మీడియాలో వదిలారు. ఇక ఇలాంటిదే అనుష్కకు కూడా జరిగింది.

ఆ మధ్య అనుష్క, ప్రభాస్‌లకు పెళ్లి అయినట్లు కొన్ని ఫోటోలను ఏఐ సాయంతో చేసి సోషల్ మీడియాలో వదిలిన సంగతి తెలిసిందే. అంతేకాదు వారికి పిల్లలు కూడా ఉన్నట్లు చూపించారు. అంతటితో ఆగని కొందరు తాజాగా మరోసారి ఒక స్టార్‌ క్రికెటర్‌తో అనుష్క పెళ్లి అంటూ కొన్ని ఫోటోలను క్రియేట్ చేసారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు కఠిన నిర్ణయం తీసుకోవాలనీ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మార్ఫింగ్‌ ఫోటోలు క్రియేట్‌ చేసిన వారిపై అనుష్క ఫ్యామిలీ మెంబర్స్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారట. దీనికి సంబంధించిన ఒక వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కొందరు అనుష్క అభిమానులు మంచి నిర్ణయం తీసుకున్నారు అలాంటి వారికి తగిన విధంగా బుద్ధి చెప్పాలి. మరోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయాలంటే భయం పుట్టాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.