Udaya Bhanu : చాలా ఏళ్ల తర్వాత ఉదయభాను యాంకర్గా రీఎంట్రీ ఇస్తున్నారు. జీ తెలుగులో జరిగిన ఒక ఈవెంట్లో తన పిల్లలతో కలిసి కనిపించారు ఉదయభాను. అదే ఈవెంట్ వేదికగా మళ్లీ యాంకరింగ్ మొదలుపెడతానని ఆమె ప్రకటించారు. అప్పటినుంచి పలు ఈవెంట్స్కు యాంకరింగ్ చేస్తూ వస్తున్న ఉదయభాను.. జీ తెలుగులో ప్రసారం కానున్న ఒక షోతో మరోసారి హోస్ట్గా సందడి చేయనున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
‘సూపర్ జోడీ’ అనే డ్యాన్స్ షో త్వరలోనే జీ తెలుగులో ప్రారంభం కానుంది. జనవరి 28న ప్రారంభమయ్యే ‘సూపర్ జోడీ’ ప్రతీ ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. ఈ షోకు సీనియర్ హీరోయిన్ మీనా.. జడ్జిగా వ్యవహరిస్తుందని తెలిసేలా ఒక ప్రోమో విడుదలైంది. ‘‘సోమవారం నుంచి శనివారం వరకు మా ఆడవాళ్లకు డైలీ సీరియల్లాగా ఇల్లు, పని.. లేకపోతే ఇంట్లో పని. సండే కూడా ఫన్ లేదు.. ఆడడానికి లేదు, చూడడానికి లేదు’’ అంటూ ఈ ప్రోమోలో మీనా.. తన లైఫ్ బోరింగ్ అయిపోయింది అన్నట్టుగా విసుగుకుంటుంది. అప్పుడే తనకు ‘ముత్తు’ సినిమా రెండు వందల రోజుల ఫంక్షన్కు సంబంధించిన అవార్డు కనిపిస్తుంది. దాన్ని చూస్తూ.. ‘‘వినోదానికి గ్యాప్ ఉండొద్దు’’ అంటూ రజినీకాంత్ చెప్పిన మాటలను గుర్తుచేసుకుంటుంది. అలా తనకు డ్యాన్స్ షోకు హోస్ట్గా వ్యవహరిస్తున్నట్టు.. అందులో 8 సెలబ్రిటీ జోడీలు ఉండనున్నట్టు ప్రకటిస్తుంది మీనా. ఇదిలా ఉండగా.. ఈ షోకు ఉదయభాను(Udaya Bhanu) హోస్ట్ అని తెలిసేలా తాజాగా మరో ప్రోమో విడుదలైంది.
Also Read: Military Rankings : ప్రపంచ మిలిటరీ ర్యాంకింగ్స్ విడుదల.. ఇండియా ర్యాంకు ఎంతో తెలుసా?
‘‘అమ్మ చెప్పేది అమ్మగా గెలిస్తేనే అన్నింటిలో గెలిచినట్టు అని. అమ్మను అయ్యాకే అమ్మ చెప్పింది గుర్తొచ్చింది. అన్నీ పక్కన పెట్టేశాను. పిల్లలే జీవితం అయిపోయారు’’ అంటూ ఉదయభాను తన పర్సనల్ లైఫ్ గురించి చెప్తున్న మాటలతో ఈ ప్రోమో ప్రారంభమవుతుంది. అదే సమయంలో ‘‘ఆపొద్దు అమ్మ’’ అంటూ తన పిల్లలు చెప్పడంతో ‘సూపర్ జోడీ’తో యాంకర్గా రీఎంట్రీ ఇస్తున్నట్టుగా ప్రకటించింది. ‘గోల్డెన్ లేడీ ఆఫ్ జీ తెలుగు ఈజ్ బ్యాక్’ అని ట్యాగ్తో ఉదయభాను ప్రోమోను విడుదల చేసింది జీ తెలుగు. సూపర్ జోడీ’ షోకు మీనాతో పాటు కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్, మరో సీనియర్ నటీమణి శ్రీదేవి విజయ్ కుమార్ కూడా జడ్జిలుగా వ్యవహరించనున్నారు.