టాలీవుడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నాయి. ముఖ్యంగా తెలుగు నుంచి పాన్ ఇండియా సినిమాలు మంచి కలెక్షన్లు సాధిస్తున్నాయి. కాసుల వర్షం కురుస్తుండటంతో హీరోల స్టార్ డమ్ ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుతం బాలీవుడ్ సైతం టాలీవుడ్ వైపు చూస్తోంది. ముఖ్యంగా అల్లు అర్జున్, ప్రభాస్ సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నాయి. దీంతో టాలీవుడ్ నుండే కాకుండా బాలీవుడ్ ప్రేక్షకులు ఈ స్టార్స్ సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ అత్యధిక పారితోషికం తీసుకునే దక్షిణాది నటుడని, భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే అగ్ర తారలలో ప్రభాస్ అని గతంలో వార్తలు వచ్చాయి.
కొన్ని నెలల క్రితం, బాహుబలి నటుడు రెమ్యునరేషన్ పెంచాడని, ఇప్పుడు ప్రతి చిత్రానికి 100 కోట్ల రూపాయలకు పైగా అందుకుంటున్నాడని అధికారిక సమాచారం. రాబోయే భారీ చిత్రం ‘ఆదిపురుష్’ కోసం 120 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నట్టు టాక్. ఇక అల్లు అర్జున్ త్వరలో ప్రభాస్ను అధిగమించి అత్యధిక పారితోషికం తీసుకుంటున్న టాలీవుడ్ నటుడిగా అవతరించడం ఖాయంగా కనిపిస్తోంది. పుష్ప సినిమా సక్సెస్ తర్వాత, ఈ ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ అమాంతంగా పెంచేశాడు. పుష్ప పార్ట్-1 కు రూ. 60 కోట్లకు పైగా అందుకుంటే, ఇక పుష్ప 2 కోసం దాదాపు 125 కోట్లు డిమాండ్ చేస్తున్నట్టు టాలీవుడ్ టాక్.
టాలీవుడ్ హీరోల రెమ్యూనరేషన్స్ ఇవే..
మహేష్ బాబు – ఒక్కో సినిమాకు 70 కోట్లు
పవన్ కళ్యాణ్ – ఒక్కో సినిమాకు 50 నుంచి 65 కోట్లు
జూనియర్ ఎన్టీఆర్ – ఒక్కో సినిమాకు 30 నుంచి 80 కోట్లు
చిరంజీవి – ఒక్కో సినిమాకు 50 కోట్లు
రామ్ చరణ్ – ఒక్కో సినిమాకు 30 నుంచి 70 కోట్లు
విజయ్ దేవరకొండ – ఒక్కో సినిమాకు 15 నుంచి 30 కోట్లు
రవితేజ – ఒక్కో సినిమాకు 15 నుంచి 20 కోట్లు
నాని – ఒక్కో సినిమాకు 13 నుంచి 20 కోట్లు