Jhanvi Kapoor: దేవరపై బిగ్ అప్డేట్ ఇచ్చిన జాన్వీ కపూర్.. ఫోటోస్ వైరల్?

  • Written By:
  • Publish Date - March 27, 2024 / 05:07 PM IST

జాన్వీ కపూర్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈమె దివంగత హీరోయిన్ అలనాటి నటి శ్రీదేవి కూతురు అన్న విషయం అందరికీ తెలిసిందే. మొదట దడక్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. ఇకపోతే ప్రస్తుతం జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సరసన దేవర మూవీలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అంతేకాకుండా జాన్వీ కపూర్ నటిస్తున్న మొదటి తెలుగు సినిమా ఇదే కావడం విశేషం.

మొదటి సినిమాలోనే ఏకంగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించే అవకాశం దక్కించుకుందీ ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే దేవర సినిమాలో జాన్వీ రెండు షేడ్స్ ఉన్న పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. మొదటి భాగంలో ఆమె తంగం అనే సముద్రయాన యువతి పాత్రలో కనిపించనుందని టాక్. ఇది ఇలా ఉంటే తాజాగా దేవర సినిమాపై బిగ్ అప్డేట్ ఇచ్చింది నటి జాన్వీ కపూర్. దేవర సినిమాలో తన షూటింగ్ పార్ట్‌ పూర్తి చేసుకుంది. ఈ మేరకు తన పాత్ర షూటింగ్ పూర్తయిందంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది జాన్వీ కపూర్.

దేవర సినిమా రెండు భాగాలుగా విడుదలవుతుండగా, ప్రస్తుతం మొదటి భాగం షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా రెండో భాగం షూటింగ్‌లో జాన్వీ తంగం పాత్రలో నటిస్తుందట. ఇకపోతే ఈ సినిమా తర్వాత జాన్వీ కపూర్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సినిమాలో నటించనుంది. ఇటీవలె ఈ మూవీకి సంబందించిన షూటింగ్ మొదలైన విషయం తెలిసిందే. ఇంకా టైటిల్ ఖరారుకాని ఈ సినిమాలో శివరాజ్ కుమార్ కూడా నటించనున్నాడు. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించనున్నారు.