Site icon HashtagU Telugu

Ambani : 2027 కల్లా భారత్ మూడో అతి పెద్ద ఆర్థిక దేశంగా అవతరించనుంది: ముకేశ్‌

Reliance Industries

Reliance Industries

Mukesh Ambani: రిలయన్స్ ఇండస్ట్రీస్ 47వ వార్షిక సర్వ సభ్య సమావేశం ప్రారంభమైంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ 35 లక్షల మంది షేర్ హోల్డర్లను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ముందుగా బోర్డ్ మెంబర్స్‌ని పరిచయం చేశారు. మూడో సారి గెలిచినందుకు ప్రధాని నరేంద్రమోడీకి శుభాకాంక్షలు తెలిపారు. వికసిత్ భారత్ ఇన్ అమృత్ కాల్ వల్ల ఇండియా దూసుకుపోతుందని ముకేశ్ అంబానీ తెలిపారు. 2027 కల్లా భారత్ వరల్డ్ మూడో అతి పెద్ద ఆర్థిక దేశంగా అవతరించనుందని తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రస్తుతం దేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా రిలయన్స్ కొనసాగుతోంది. ఈ ఏడాదిలోనే రూ.20 లక్షల మార్కెట్ విలువ మార్క్ దాటింది. 2016 ఏజీఎం సమావేశంలో జియో సేవలను ప్రకటించింది రిలయన్స్. ఇక 2017లో చూస్తే రూ.1500కే జియో ఫోన్ తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. ఆ తర్వాత 2018లో 2999కే జియో ఫోన్ 2 తీసుకొచ్చింది. 2019లో సౌదీ ఆరామ్‌కో పెట్టుబడులతో పాటు జియో ఫైబర్‌ లాంచ్ చేస్తున్నట్లు తెలిపింది. 2021లో న్యూ ఎనర్జీ వ్యాపారంపై ప్రకటన చేసింది.

కాగా, భారతదేశపు అత్యంత విలువైన కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) సెప్టెంబర్ 5న జరగనున్న బోర్డు సమావేశంలో 1:1 బోనస్ షేర్‌ను పరిగణనలోకి తీసుకోనుంది. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆర్థిక పనితీరు, దాని వ్యాపార విస్తరణల మధ్య వాటాదారులకు ప్రతిఫలమివ్వడానికి ప్రయత్నిస్తోంది. ఈక్విటీ షేర్‌హోల్డర్‌లకు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్‌ల జారీ, ఆమోదం కోసం కంపెనీ డైరెక్టర్ల బోర్డు సమావేశం 2024 సెప్టెంబర్ 5న జరగనుందని ఆగస్ట్ 29న స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో RIL తెలిపింది. బోనస్ షేర్లతో మార్కెట్‌లో RIL షేర్ల లిక్విడిటీని మెరుగుపరుస్తుంది. వాటిని విస్తృతమైన పెట్టుబడిదారులకు అందుబాటులో ఉంచుతుంది. ఈ ప్రకటనతో ఆగస్ట్ 29 మధ్యాహ్నం 2 గంటలకు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 2.4 శాతం పెరిగి ఒక్కొక్కటి రూ.3,068 వద్ద ట్రేడవుతున్నాయి.

“రిలయన్స్ వృద్ధి చెందినప్పుడు, మేము మా షేర్‌హోల్డర్‌లకు చక్కగా రివార్డ్ చేస్తాము. మా షేర్‌హోల్డర్‌లకు చక్కగా రివార్డ్ ఇచ్చినప్పుడు, రిలయన్స్ వేగంగా అభివృద్ధి చెందుతుంది. మరింత విలువను సృష్టిస్తుంది. మీ కంపెనీ శాశ్వత పురోగతికి హామీగా ఉంది” అని AGMలో ఛైర్మన్ ముఖేష్ అంబానీ అన్నారు.

Read Also: Bharat Dojo Yatra : త్వరలో ‘భారత్‌ డోజో యాత్ర’.. వీడియో షేర్ చేసిన రాహుల్‌గాంధీ