Mukesh Ambani : రూ.151 కోట్ల భారీ విరాళం ఇచ్చిన ముఖేశ్ అంబానీ… ఎవరికంటే!

విద్యార్థిగా మార్గదర్శనంగా నిలిచిన ఈ సంస్థకు, తన గురువు ప్రొఫెసర్ ఎంఎం శర్మకు గురుదక్షిణగా ఈ విరాళం ప్రకటిస్తున్నట్లు ముఖేశ్ అంబానీ పేర్కొన్నారు. ఈ ప్రకటన ‘డివైన్ సైంటిస్ట్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా వెలువడింది.

Published By: HashtagU Telugu Desk
Mukesh Ambani, who donated a huge amount of Rs. 151 crore... more than anyone else!

Mukesh Ambani, who donated a huge amount of Rs. 151 crore... more than anyone else!

Mukesh Ambani : రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ముఖేశ్ అంబానీ తన విద్యాభ్యాస పాఠశాలకు అభివృద్ధి నిధుల రూపంలో గొప్ప సేవ చేశారనడానికి ఈ వార్తే ఉదాహరణ. ముంబయిలోని ప్రముఖ విద్యాసంస్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ICT)కు ఆయన ఏకంగా రూ.151 కోట్లు విరాళంగా ప్రకటించారు. విద్యార్థిగా మార్గదర్శనంగా నిలిచిన ఈ సంస్థకు, తన గురువు ప్రొఫెసర్ ఎంఎం శర్మకు గురుదక్షిణగా ఈ విరాళం ప్రకటిస్తున్నట్లు ముఖేశ్ అంబానీ పేర్కొన్నారు. ఈ ప్రకటన ‘డివైన్ సైంటిస్ట్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా వెలువడింది. ఈ పుస్తకం ప్రొఫెసర్ ఎంఎం శర్మ జీవితం, సేవల ఆధారంగా రూపొందించబడింది. కార్యక్రమంలో ప్రసంగించిన ముఖేశ్ అంబానీ ఈ విరాళాన్ని ఐసీటీ తమ అవసరాలకు అనుగుణంగా, అభివృద్ధి ప్రయోజనాల కోసం వినియోగించుకోవచ్చు అని తెలిపారు.

Read Also: CM Chandrababu : రాష్ట్ర అభివృద్ధిలో స్పష్టమైన మార్పు: సీఎం చంద్రబాబు

1970లో కెమికల్ ఇంజనీరింగ్‌లో పట్టభద్రులైన అంబానీ, అప్పట్లో ఈ సంస్థను యూనివర్సిటీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (UDCT)గా పిలిచేవారని గుర్తు చేసుకున్నారు. దాదాపు మూడు గంటల పాటు ఐసీటీ ప్రాంగణంలో గడిపిన ఆయన, తన విద్యార్థి దశ జ్ఞాపకాలను, గురువైన ప్రొఫెసర్ శర్మతో తన అనుబంధాన్ని స్మరించుకున్నారు. ఆ దశల్లో నేర్చుకున్న విలువలే, నన్ను పారిశ్రామిక రంగంలో ముందుకు నడిపించాయి అని ఆయన అన్నారు. ప్రొఫెసర్ శర్మ దార్శనికతను ప్రముఖంగా ప్రశంసించిన అంబానీ, భారత ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలకు ఆయనే బీజం వేసారు. లైసెన్స్ పర్మిట్ రాజ్ నుంచి దేశాన్ని బయటపెట్టాలి అన్నదే ఆయన ఆశయం. ఆయన ఆలోచనలే పాలకులకు మార్గనిర్దేశం చేశాయి అని వ్యాఖ్యానించారు.

ముఖేశ్ అంబానీ తన తండ్రి ధీరూబాయ్ అంబానీ ఆవేశాన్ని గుర్తు చేస్తూ భారత పారిశ్రామిక రంగ అభివృద్ధిలో నా తండ్రికి ఉన్న తపన అదే తపన ప్రొఫెసర్ శర్మలో కూడా కనిపించింది. వారి తత్వం దేశాన్ని ప్రేరేపించేలా ఉండింది అని చెప్పారు. ప్రొఫెసర్ శర్మ దేశానికి ‘గురు ఆఫ్ భారత్’ అని పిలవాల్సిందే. ఆయన సేవలకు గుర్తింపుగా ఈ విరాళాన్ని సమర్పిస్తున్నాను అంటూ ఆహ్లాదంగా చెప్పారు ముఖేశ్ అంబానీ. ఈ విరాళం ద్వారా ఐసీటీ సాంకేతిక విద్య, పరిశోధనల్లో మరింత మెరుగుదల సాధిస్తుందని, రాబోయే తరాలకు ప్రేరణగా నిలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంబానీ ఔదార్యం దేశంలో దాతృత్వానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

Read Also: Delhi: పెళ్లాంతో గొడవ ఢిల్లీ సీఎంను చంపేస్తానని ఫోన్

 

 

 

  Last Updated: 07 Jun 2025, 04:20 PM IST