Site icon HashtagU Telugu

Forceful Layoffs : బలవంతపు ఉద్యోగ కోతలు.. ‘ఇన్ఫోసిస్‌’పై ప్రధాని ఆఫీసుకు ఫిర్యాదులు

Infosys Trainees Forceful Layoffs Pms Office Pm Modi

Forceful Layoffs : ఇన్ఫోసిస్‌.. మన దేశంలోని టాప్-3 ఐటీ కంపెనీల్లో ఒకటి. ఈ కంపెనీకి కర్ణాటకలోని మైసూరులో ఒక క్యాంపస్ ఉంది. ఇందులో పనిచేస్తున్న దాదాపు 400 మంది ట్రైనీ ఉద్యోగులను ఫిబ్రవరి మొదటివారంలో విధుల్లో నుంచి తొలగించడంపై దుమారం రేగింది. వారిని బలవంతంగా విధుల నుంచి తప్పించారనే ఆరోపణలు వినిపించాయి. చివరకు ఈ వ్యవహారం ప్రధానమంత్రి ఆఫీసు(పీఎంఓ) దాకా చేరింది. తమను ఇన్ఫోసిస్ కంపెనీ బలవంతంగా జాబ్స్‌ నుంచి తొలగించింది అంటూ వారు పీఎంఓకు కంప్లయింట్ ఇచ్చినట్లు సమాచారం. దీనిపై పీఎంఓకు 100కుపైగా కంప్లయింట్స్ వెళ్లాయట.

Also Read :Sea Color : ఏపీలో సముద్రం రంగు ఎందుకు మారుతోంది ? కారణాలివీ

కేంద్రం స్పందన..

‘‘ఈ విషయంలో ప్రధానమంత్రి జోక్యం చేసుకోవాలి. మా ఉద్యోగాలను(Forceful Layoffs) తిరిగి ఇప్పించాలి. భవిష్యత్తులో ఇలాంటి తొలగింపులు జరగకుండా చూడాలి’’ అని ఫిర్యాదుల్లో ట్రైనీలు కోరారంటూ జాతీయ మీడియాలో కథనాలు ప్రచురితం అయ్యాయి. పీఎంఓకు ఈ ఫిర్యాదులు అందిన తర్వాతే కేంద్ర కార్మిక శాఖ స్పందించింది. దీనికి సంబంధించి కర్ణాటక రాష్ట్ర కార్మిక శాఖకు ఫిబ్రవరి 25వ తేదీనే కేంద్ర కార్మిక శాఖ నోటీసులను పంపింది. రాష్ట్ర కార్మిక శాఖ అధికారులు దర్యాప్తు జరిపి కేంద్రానికి నివేదిక ఇవ్వాలని నిర్దేశించింది.

Also Read :Shah Rukh Khan: ‘మన్నత్’ నుంచి అద్దె ఇంట్లోకి షారుఖ్.. ఎందుకో తెలుసా ?

ఇన్ఫోసిస్‌ వివరణ ఇదీ

400 మంది ట్రైనీల తొలగింపుపై ఇప్పటికే ఇన్ఫోసిస్‌ వివరణ విడుదల చేసింది. ‘‘వరుసగా మూడు ఎవాల్యుయేషన్‌ పరీక్షల్లో వాళ్లు విఫలమయ్యారు. అందుకే వారిని తొలగించాం. ఈ పరీక్షలు మా సంస్థ నిబంధనల్లో భాగం. కంపెనీ పురోగతికి అవి చాలా ముఖ్యం’’ అని ఇన్ఫోసిస్ స్పష్టం చేసింది.

400 మంది ఎవరు ?