Site icon HashtagU Telugu

Airtel: ఎయిర్‌టెల్ వినియోగ‌దారుల‌కు గుడ్ న్యూస్‌!

Sim Users

Sim Users

Airtel: ట్రాయ్ మార్గదర్శకాలను అనుసరించి టెలికాం కంపెనీలు తమ వాయిస్ ప్లాన్‌లను మాత్ర‌మే ప్రారంభించడం ప్రారంభించాయి. కొన్ని రోజుల క్రితం జియో మొదట వాయిస్ ప్లాన్‌లను మాత్ర‌మే ప్రారంభించింది. త‌ర్వాత‌ ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఐడియా కూడా తమ వాయిస్ ప్లాన్‌లను ప్రవేశపెట్టాయి. అయితే టెలికాం కంపెనీలు ప్రారంభించిన వాయిస్ ప్లాన్‌లను 7 రోజుల్లో పరిశీలిస్తామని TRAI స్పష్టం చేసింది. ఈ ఆర్డర్ తర్వాత ఎయిర్‌టెల్ (Airtel) తన రెండు ప్లాన్‌లను సవరించింది. వాటిని త‌క్కువ ధ‌ర చేసింది. ఇప్పుడు వినియోగదారులు తక్కువ డబ్బుతో ఈ ప్లాన్‌లను పొందుతారు.

84 రోజుల ప్లాన్‌

ఎయిర్‌టెల్ ఈ ప్లాన్‌ను రూ. 499 ధరతో ప్రారంభించింది. ఇది ఇప్పుడు రూ. 469కి స‌వ‌రించారు. కంపెనీ ప్లాన్ ధరను రూ.30 తగ్గించింది. ఈ ప్లాన్‌లో వినియోగదారులు భారతదేశం అంతటా ఏ నంబర్‌కైనా కాల్ చేయడానికి అపరిమిత వాయిస్ కాలింగ్, ఉచిత జాతీయ రోమింగ్ ప్రయోజనాన్ని పొందుతారు. ఎయిర్‌టెల్ ఈ ప్లాన్‌లో వినియోగదారులకు 900 ఉచిత SMSల ప్రయోజనాన్ని కూడా అందిస్తోంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో వినియోగదారులకు ఎటువంటి డేటా రాదు. ఇది ముఖ్యంగా 2G ఫీచర్ ఫోన్ వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది.

Also Read: Turmeric Water: ప్రతిరోజు పరగడుపున పసుపు నీరు తాగితే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

365 రోజుల ప్లాన్‌

ఎయిర్‌టెల్ ఇంతకుముందు ఈ ప్లాన్‌ను రూ. 1959 ధరతో ప్రారంభించింది. ఇప్పుడు ఈ ప్లాన్ రూ.1,849కి మార్చారు. కంపెనీ ప్లాన్ ధరను రూ.110 తగ్గించింది. ఎయిర్‌టెల్ ఈ ప్లాన్‌లో వినియోగదారులు పూర్తి 365 రోజుల చెల్లుబాటును పొందుతారు. ఇందులో వినియోగదారులు అపరిమిత కాలింగ్, ఉచిత జాతీయ రోమింగ్ ప్రయోజనాన్ని పొందుతారు. అలాగే వినియోగదారులు మొత్తం 3600 ఉచిత SMSల ప్రయోజనాన్ని కూడా పొందుతారు.

రిలయన్స్ జియో వాయిస్ ప్లాన్ గురించి మాట్లాడుకుంటే.. కంపెనీ 84 రోజుల ప్లాన్ రూ.458కి వస్తుంది. ఈ ప్లాన్‌లో కంపెనీ భారతదేశం అంతటా అపరిమిత వాయిస్ కాలింగ్‌తో పాటు 1,000 ఉచిత SMSలను అందిస్తుంది. ఇదే సమయంలో కంపెనీ 365 రోజుల ప్లాన్ ధర రూ.1,958. ఈ ప్లాన్‌లో మీరు అపరిమిత కాలింగ్‌తో పాటు 3,600 ఉచిత SMSల‌ ప్రయోజనాన్ని పొందుతారు.