New Maruti Suzuki: మారుతి సుజుకి ఎర్టిగా బుకింగ్స్ స్టార్ట్

భారత్ లో అతిపెద్ద కార్ల తయారీదారు సంస్థ మారుతీ సుజుకీ ఇండియా తన మల్టీ పర్పస్ వెహికల్ ఎర్టిగా కొత్త వెర్షన్ కోసం బుకింగ్స్ స్టార్ట్ చేసినట్లు ప్రకటించింది.

  • Written By:
  • Updated On - April 8, 2022 / 11:13 AM IST

భారత్ లో అతిపెద్ద కార్ల తయారీదారు సంస్థ మారుతీ సుజుకీ ఇండియా తన మల్టీ పర్పస్ వెహికల్ ఎర్టిగా కొత్త వెర్షన్ కోసం బుకింగ్స్ స్టార్ట్ చేసినట్లు ప్రకటించింది. స్మార్ట్ హైబ్రిడ్ టెక్నాలజీతో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో నడిచే నెక్ట్స్ -జెన్ ఎర్టిగా వచ్చే వారం రిలీజ్ కానుంది. రూ. 11,000చెల్లించి బుక్ చేసుకోవచ్చని కంపెనీ ప్రకటించింది. మారుతీ సుజుకి ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడారు. ఎర్టిగా 7.5 లక్షల యూనిట్లకు పైగా అమ్ముడైందని…భారత్ ఎంపీవీ మార్కెట్లో గేమ్ -ఛేంజర్ అన్నారు. నెక్ట్స్ జనరేషన్ ఎర్టిగాలో ఆలోచనాత్మకమైన నూతన ఫీచర్స్ అప్ గ్రేడ్ చేసిన పవర్ ట్రెయిన్, అధునాతన 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్స్ ఇందులో ఉన్నాయని తెలిపారు.

ఇది కస్టమర్లకు వారి ప్రియమైన వారితో కలిసి సుదీర్ఘ ప్రయాణాలకు వీలు కల్పిస్తుందన్నారు. మరింత ఇంధన సమర్దవంతమైన, శక్తివంతమైన, సాంకేతికంగా డెవలప్ చెందిన కారుగా తోడు ఉంటుందని తెలిపారు. కొత్త ఎర్టిగా 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్, సుజుకి కనెక్ట్ 7 అంగుళాల స్మార్ట్ ప్లే ప్రో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ వంటి లేటెస్టు ఫీచర్లతో వస్తుందని కంపెనీ తెలిపింది. సీఎన్జీ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుందని తెలిపింది. మారుతీ సుజుకీ సంస్థ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ సీవీ రామన్ మాట్లాడుతూ…నెక్ట్స్ జెన్ ఎర్టిగాలో సరికొత్త కె సీరిస్ పవర్ ట్రెయిన్ సహా ఆధునాతన ఫీచర్లతో సురక్షితమైన డ్రైవింగ్ ఎక్స్ పీరియన్స్ పొందవచ్చని తెలిపారు.

భారత మార్కెట్లో ఈ మధ్య కాలంలో కొత్త మారుతీ సుజుకీ వ్యాగన్ ఆర్ టూర్ హెచ్ 3 రిలీజ్ అయ్యింది. మార్కెట్లో వ్యాగన్ ఆర్ టూర్ హెచ్ 3 పెట్రోల్ వెర్షన్ ధర రూ. 5.39లక్షలు. ఇందులో సీఎన్జీ వెర్షన్ ధర రూ. 6.34 లక్షలు. ఇది ఆధునిక డిజైన్ కలిగి లేటెస్ట్ ఫీచర్స్ తో చాలా సానుకూలంగా ఉంటుంది. ఇది డ్యూయల్ ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ తో యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ స్పీడ్ లిమిటింగ్ ఫంక్షన్ రియర్ పార్కింగ్ సెన్సార్ల వంటి సేఫ్టీ ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి.