విండ్ టర్బైన్ టెక్నాలజీ గురించి ప్రస్తావించారు పారిశ్రామిక, వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా. ఈ టెక్నాలజీ ఇండియా వద్ద ఉంటే కచ్చితంగా…ప్రపంచ శక్తిగా ఎదుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. నిత్యం ట్రాఫిక్ నడిచే రోడ్డు మధ్యలో ఓ గాలితో తిరిగే టర్బైన్ ఉంటుంది. వాహనాల వేగానికి ఆ టర్బైన్ తిరుగుతుంది. దీంతో శక్తి ఉత్పత్తి అవుతుంది. ఆ విధంగా ఒక గంటలోనే కిలో వాట్ శక్తి వస్తుంది. ఈ టెక్నాలజీని టర్కీలోని ఇస్తాంబుల్ టెక్నికల్ యూనివర్సిటీ డెవలప్ చేసిందని ఆనంద్ మహీంద్రా వెల్లడించారు.
భారత్ లో ట్రాఫిక్ ఎలాంటి తెలిసిందే. ఇదే టెక్నాలజీని మనం కూడా ఉపయోగిస్తే ఎలా ఉంటుంది. పవన ఆధారిత శక్తి రంగంలో భారత్ కూడా అగ్రగ్రామిగా నిలుస్తుందన్నారు. మన జాతీయ రహదారులపై ఈ పవన విద్యుత్ టర్బైన్ లు ఏర్పాటు చేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తే బాగుంటుందని ఆనంద్ మహీంద్రా సూచించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని…తన ట్వీట్ కు ట్యాగ్ చేశారు ఆనంద్ మహీంద్రా. అంతేకాదు టర్కీ డెవలప్ చేసిన విండ్ టర్బైన్ పనితీరును వీడియోను కూడా ట్విట్ లో పంచుకున్నారు. భారత్ లో ఎంత విపరీతమైన ట్రాఫిక్ ఉంటుందో తెలిసిందేనని, ఇదే టెక్నాలజీని మనం కూడా ఉపయోగిస్తే పవన ఆధారిత శక్తి రంగంలో భారత్ కూడా అగ్రగామిగా నిలుస్తుందని ఉద్ఘాటించారు. మన జాతీయ రహదారులపై ఈ పవన విద్యుత్ టర్బైన్ లను ఏర్పాటు చేసే అంశాన్ని కేంద్రం పరిశీలించాలని ఆనంద్ మహీంద్రా సూచించారు. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని తన ట్వీట్ కు ట్యాగ్ చేశారు. అంతేకాదు, టర్కీ అభివృద్ధి చేసిన విండ్ టర్బైన్ పనితీరు వీడియోను కూడా పంచుకున్నారు.
Developed by Istanbul Technical University. Ingenious. Uses the wind generated by passing traffic. Given India’s traffic, we could become a global force in wind energy! 😊 Can we explore using them on our highways @nitin_gadkari ji? https://t.co/eEKOhvRpDo
— anand mahindra (@anandmahindra) April 6, 2022