Yuvagalam : ఊరుకో విల్లా, న‌గ‌రికి 5 ఎమ్మెల్యేలు, రోజాకు జ‌బ‌ర్ద‌స్త్ లోకేష్ కౌంట‌ర్

మంత్రి రోజా అవినీతి, అక్ర‌మాల‌పై లోకేష్ తొలి రోజే(Yuvagalam) ధ్వ‌జ‌మెత్తారు.

  • Written By:
  • Updated On - February 13, 2023 / 05:35 PM IST

మంత్రి రోజా అవినీతి, అక్ర‌మాల‌పై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ తొలి రోజే(Yuvagalam) ధ్వ‌జ‌మెత్తారు. న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలోకి ఎంట్రీ ఇచ్చిన యువ‌గ‌ళం సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో లోకేష్ (Lokesh) మాట్లాడుతూ రోజా అవినీతి చిట్టాను విప్పారు. ఆమె ఇచ్చిన హామీల‌ను గాలికొదిలేసి దుబాయ్, సింగ‌పూర్ ట్రిప్పులు వేస్తున్నార‌ని ఫైర్ అయ్యారు. గ్రావెల్ నుంచి ప్ర‌తి ప‌నిలోనూ వాటాల‌ను తీసుకుంటున్నార‌ని రోజా మీద ఆరోప‌ణ‌లు చేశారు.

మంత్రి రోజా అవినీతి, అక్ర‌మాల‌పై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ తొలి రోజే(Yuvagalam)

న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలోని 5 మండ‌లాలను ఐదుగురు కుటుంబ స‌భ్యుల‌కు అప్ప‌గించార‌ని లోకేష్ ఆరోపించారు. ఈ నియోజ‌క‌వ‌ర్గానికి ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నార‌ని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ఆమె తీసుకున్న వాటాల గురించి విడ‌మ‌ర‌చి(Yuvagalam) చెప్పారు. ఎమ్మెల్యే అయిన త‌రువాత బెంజ్ కారు రోజాకు వ‌చ్చింద‌ని విమ‌ర్శించారు. ఊరుకో విల్లాను తీసుకుంటే రెండు చేతులా వాటాలు తీసుకుంటుంద‌ని ఆరోపించారు. ఏ ఊర్లో ఎక్క‌డ అక్ర‌మాల‌కు రోజా పాల్ప‌డ్డారో తెలియ‌చేస్తూ లోకేష్(Lokesh) ప్ర‌సంగించారు.

డైమండ్ పాప‌కు బ‌దులుగా జ‌బ‌ర్ద‌స్త్ ఆంటీ అంటూ…

ఇటీవ‌ల రోజాను డైమండ్ పాప గా వ‌ర్ణించారు. దానిపై రోజా మండిప‌డుతూ పుల‌కేసిగా సెటైర్లు వేస్తూ మీడియాకు ఎక్కారు. చీర‌, గాజులు పంపిస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. అందుకు ప్ర‌తిగా వాటిని మ‌హిళామ‌ణుల‌కు ఇస్తాన‌ని, వాళ్ల పాదాల‌కు న‌మ‌స్క‌రిస్తానంటూ లోకేష్ బదులిచ్చారు. సోమ‌వారం న‌గ‌రి ఎంట్రీ ఇచ్చిన (Yuvagalam) సంద‌ర్భంగా డైమండ్ పాప‌కు బ‌దులుగా జ‌బ‌ర్ద‌స్త్ ఆంటీ అంటూ సంభోదించారు. జ‌బ‌ర్ద‌స్త్ గా అవినీతికి పాల్ప‌డుతూ న‌గ‌రి ప్ర‌జ‌ల‌ను గాలికి వ‌దిలేసింద‌ని దుయ్య‌బ‌ట్టారు.

రాబోవు ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థిగా భానుకు ఓటేసి చ‌రిత్ర‌ను తిర‌గ రాయాల‌ని..

గాలేరు-న‌గ‌రి ప్రాజెక్టును అధికారంలోకి రాగానే పూర్తి చేస్తామ‌ని హామీ ఇచ్చారు. చిర‌కాలంగా ఎదురుచూస్తున్న ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను నెర‌వేరుస్తామ‌ని చెప్పారు. మంత్రి రోజా రెండుసార్లు గెలిచిన‌ప్ప‌టికీ ఏమీ చేయ‌లేక‌పోయార‌ని ఆరోపించారు. రాబోవు ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థిగా భానుకు ఓటేసి చ‌రిత్ర‌ను తిర‌గ రాయాల‌ని పిలుపునిచ్చారు. వేదిక వ‌ద్ద‌కు వ‌చ్చిన జ‌నాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఎమ్మెల్యే అయిన త‌రువాత రోజా ఎలా ఉన్నారు? నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల ప‌రిస్థితి ఎలా ఉంది? అనేది ఆలోచించాల‌ని కోరారు.

లోకేష్  ప్ర‌సంగం మొత్తం మంత్రి రోజాను జ‌బ‌ర్ద‌స్త్ ఆంటీ అంటూ…(Lokesh)

లోకేష్ (Lokesh) ప్ర‌సంగం మొత్తం మంత్రి రోజాను జ‌బ‌ర్ద‌స్త్ ఆంటీ అంటూ సంబోధించారు. తొలి రోజే ఆమె సెటైర్లు పేల్చిన ఆయ‌న మంగ‌ళ‌వారం నుంచి సీరియ‌స్ గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇంటిలోని అందర్నీ రాజ‌కీయాల్లోకి తీసుకొచ్చి అవినీతి భాగాల‌ను రోజూ రాత్రికి పంచుకుంటార‌ని ఆరోపించారు. ఇలాంటి ఎమ్మెల్యే అవ‌స‌ర‌మా? అంటూ లోకేష్ ప్ర‌జ‌ల్ని ప్ర‌శ్నించారు. పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌చ్చిన జ‌నాన్ని ఉద్దేశించి ఆయ‌న ప్ర‌సంగించినంత సేపు పాజిటివ్ గా వాళ్లు స్పందించ‌డం గ‌మ‌నార్హం.

Also Read : Roja Vs Lokesh: పొలిటికల్ హీట్.. డైమండ్ రోజా, లోకేష్ అంకుల్!