YSRCP Sitting MLAs: శ్రీకాకుళం సిట్టింగ్ ఎమ్మెల్యేలపై జగన్ నమ్మకం, కానీ మార్చాలంటూ డిమాండ్స్

శ్రీకాకుళం జిల్లాలోని మొత్తం ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను కొనసాగించాలని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. అయితే వైఎస్సార్‌సీపీ ద్వితీయశ్రేణి నేతలు మాత్రం సీఎం జగన్ నిర్ణయంపై అసంతృప్తి

YSRCP Sitting MLAs: శ్రీకాకుళం జిల్లాలోని మొత్తం ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను కొనసాగించాలని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. అయితే వైఎస్సార్‌సీపీ ద్వితీయశ్రేణి నేతలు మాత్రం సీఎం జగన్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.పలాస, నరసన్నపేట, ఎచ్చెర్ల, ఆమదాలవలస, పాతపట్నం ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ మండల, నియోజకవర్గ స్థాయి నాయకులు అక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను మార్చాలంటూ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రికి అల్టిమేటం జారీ చేశారు. అయితే వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలనే కొనసాగించాలని పార్టీ అధ్యక్షుడు నిర్ణయం తీసుకోవడంతో అసమ్మతి నెలకొంది.

పలాస సిట్టింగ్‌ ఎమ్మెల్యే, పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పల రాజుపై వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు దువ్వాడ శ్రీకాంత్‌ తదితరులు తిరుగుబాటు చేసి అభ్యర్థిని మార్చాలని డిమాండ్‌ చేశారు. నరసన్నపేట నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం, సిట్టింగ్‌ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌పై సారవకోట, జలుమూరు, పోలాకి, నరసన్నపేట మండలాలకు చెందిన డోల జగన్‌మోహన్‌రావు, తమ్మినేని భూషణ్‌రావు, తదితరులు అతడిని తప్పించుకోవాలని కోరారు.

ఎచ్చెర్లలోనూ వైఎస్‌ఆర్‌సీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌కు నిరసన సెగ తప్పడం లేదు. రణస్థలం, సిగడాం, లావేరు, ఎచ్చెర్ల మండలాల్లో పార్టీ నేతలు ఎమ్మెల్యేను తప్పించాలంటున్నారు. వరుస సమావేశాలు నిర్వహించి అభ్యర్థిని మార్చాలని పార్టీ హైకమాండ్‌కు అల్టిమేటం ఇచ్చారు. పాతపట్నం వైఎస్‌ఆర్‌సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై కొత్తూరు, మెళియాపుట్టి, పాతపట్నం మండలాల్లో పార్టీ నేతల ఆగ్రహానికి గురవుతున్నారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించి ఆమెను మార్చాలని పార్టీ హైకమాండ్‌ను డిమాండ్ చేస్తున్నారు.

Also Read: Regina : పెళ్లి పీటలు ఎక్కబోతున్న రెజీనా..?