YCP Mekapati :ఎమ్మెల్మే ట్ర‌యాంగిల్ ఎపిసోడ్, బెంగుళూరులో ప్రియురాలు?

నెల్లూరు జిల్లా ఉద‌య‌గిరి నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి(YCP Mekapati)

  • Written By:
  • Updated On - January 12, 2023 / 05:19 PM IST

నెల్లూరు జిల్లా ఉద‌య‌గిరి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి(YCP Mekapati) స‌రికొత్త ఫ్యామిలీ ఎపిసోడ్ రోజుకో మ‌లుపు తిరుగుతోంది. ఆయ‌న కుమారుడికి శివ‌చ‌ర‌ణ్ రెడ్డి ఇటీవ‌ల సోష‌ల్ మీడియా వేదిక‌గా లేఖ రాసిన విష‌యం విదిత‌మే. తాజాగా వీడియో పెడుతూ డీఎన్ ఏ(DNA) ప‌రీక్ష‌కు వ‌స్తాన‌ని, తండ్రిగా ఒప్పుకోవాల‌ని మేక‌పాటిని(YCP Mekapati) అభ్య‌ర్థించారు. మొత్తం 18ఏళ్ల ర‌హ‌స్య వ్య‌వ‌హారాన్ని బయ‌ట పెట్టాడు. అంతేకాదు, శివ‌చ‌ర‌ణ్ త‌ల్లి ల‌క్ష్మీదేవి కూడా సోష‌ల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆమె కూడా ఒక వీడియో పెట్టారు. ఎమ్మెల్యే చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి బెంగుళూరు కేంద్రంగా ర‌హ‌స్యంగా పెట్టిన కాపురం గురించి పూస‌గుచ్చిన‌ట్టు ఆ వీడియోలో వివ‌రించారు. గ‌త కొన్ని రోజులుగా హ‌ల్ ల్ చేస్తోన్న వీడియోల‌పై ఎమ్మెల్యే చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి స్పందించారు. ఇద్ద‌రు మాత్ర‌మే కుమార్తెలు ఉన్నార‌ని, కుమారుడు త‌న‌కు లేడ‌ని వివ‌ర‌ణ ఇస్తున్నారు. ఆ విష‌యాన్ని తెలుసుకున్న శివ‌చ‌ర‌ణ్ కుమార్ డీఎన్ ఏ(DNA) టెస్ట్ కు రావాల‌ని చంద్ర‌శేఖ‌ర్ రెడ్డిని అభ్య‌ర్థించ‌డం ఈ ఫ్యామిలీ ఎపిసోడ్ లోని తాజా మ‌లుపు.

 మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి ఫ్యామిలీ ఎపిసోడ్(YCP Mekapati) 

ఎమ్మెల్యే చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి జ‌రుగుతోన్న ఈ మొత్తం త‌తంగంపై ఒక వీడియోను మీడియాకు విడుద‌ల చేశారు. దాని ప్ర‌కారం ఇద్దరు కూతుళ్లు మాత్రమే ఉన్నారు. కొడుకులు లేరు. మొదటి భార్య తులసమ్మకు రచనారెడ్డి, రెండో భార్య శాంతకుమారికి సాయి ప్రేమితారెడ్డి ఉన్నారు. వాళ్లిద్ద‌రే ఆయ‌న కుమార్తెలు, వారసులు కూడా. డబ్బు కోసమే ల‌క్ష్మీదేవి, శివ చ‌ర‌ణ్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తున్నార‌ని చంద్రశేఖర్ రెడ్డి వీడియోలోని సారాంశం. రాజకీయంగా న‌ష్ట‌ప‌ర‌చ‌డానికి కొంద‌రు శివచరణ్ రెడ్డి ద్వారా లేని ఫ్యామిలీ ఎపిసోడ్ ను సృష్టించార‌ని చెబుతున్నారు.

Also Read : Mekapati ChandraSekhar Reddy: నేను ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి కొడుకునే.. దేనికైనా రెడీ..!

ఇక శివ‌చ‌ర‌ణ్ రెడ్డి విడుద‌ల చేసిన వీడియో ప్ర‌కారం మేనమామ కొండారెడ్డితో ల‌క్ష్మీదేవికి చిన్న వ‌య‌సులోనే వివాహ జ‌రిగింది. విభేదాల కార‌ణంగా వెంట‌నే విడిపోయారు. ఆ స‌మ‌యంలో ల‌క్ష్మీదేవితో మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సంబంధం పెట్టుకున్నారు. వాళ్లిద్ద‌రికి మ‌ధ్య ఏర్ప‌డిన సంబంధం త‌రువాత‌ ఐదేళ్లకు జ‌న్మించిన‌ట్టు ఆ వీడియోలో శివ‌చ‌ర‌ణ్ రెడ్డి వినిపించిన వాయిస్. డబ్బు కోసం ఇదంతా చేయ‌డంలేద‌ని వివ‌రించాడు. సర్టిఫికెట్లలో తండ్రిగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పేరే ఉందని చెబుతున్నాడు. డీఎన్ఏ పరీక్షలకు తాను సిద్ధమని, మేకపాటి కొడుకుగా నిరూపిస్తానని శివచరణ్ రెడ్డి అంటున్నాడు. రాజకీయ వారసత్వం, ఆస్తి అక్కర్లేదని కేవలం ఒక తండ్రికి పుట్టిన కొడుకుగా గుర్తింపు కోసం మాత్రమే ఈ ప్ర‌య‌త్నం చేస్తున్నాన‌ని వీడియో ద్వారా శివ చరణ్ రెడ్డి వినిపించారు.

చంద్ర‌శేఖ‌ర్ రెడ్డికి కౌంట‌ర్ ఇస్తూ ల‌క్ష్మీదేవి

మేక‌పాటి శివ‌చ‌ర‌ణ్ రెడ్డి వీడియో విడుద‌ల త‌రువాత స్పందించిన ఎమ్మెల్యే చంద్ర‌శేఖ‌ర్ రెడ్డికి కౌంట‌ర్ ఇస్తూ ల‌క్ష్మీదేవి బ‌య‌ట‌కు వచ్చారు. ఆమెకు చంద్ర‌శేఖ‌ర్ రెడ్డితో ఉన్న ప్రేమ‌బంధాన్ని వీడియో రూపంలో బ‌య‌ట‌పెట్టారు. ఆ వీడియో ప్ర‌కారం చంద్ర‌శేఖ‌ర్ రెడ్డితో ఉన్న శాంతకుమారి లక్ష్మీదేవికి ఇటీవ‌ల ప‌రిచ‌యం అయింది. అప్ప‌టి నుంచి చంద్రశేఖర్ రెడ్డి బెంగుళూరులోని ల‌క్ష్మీదేవి ఇంటికి రాకుండా మానుకున్నారు. ఆ విష‌యం తెలిసి మందలించడంతో పూర్తిగా రావడమే మానేశారు. దీంతో ఆమెకు క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. గతంలోనే వివాహ‌మైన విష‌యాన్ని చెబుతూ రెండేళ్లకు భర్త నుంచి విడిపోయినట్లు ల‌క్ష్మీదేవి వీడియో ద్వారా వెల్ల‌డించారు. దీంతో పిన్ని దగ్గర ఉన్న సమయంలో పెళ్లి చేసుకుంటానని చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి ప్రామిస్ చేశారు. ఇంటికి తీసుకెళతానని నమ్మించారని ఆమె వీడియో ద్వారా చెప్పిన వాయిస్.

Also Read : Mekapati Family: ‘మంత్రి ప‌ద‌వి’ ఆఫ‌ర్ నిరాక‌ర‌ణ‌?

ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదని, రెండేళ్ల పాటు ఇంటి చుట్టూ చంద్రశేఖర్ రెడ్డి తిరిగార‌ట‌. దీంతో బెంగళూరులో కాపురం పెట్టారని, దాదాపు 18 ఏళ్లు చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి త‌న‌తో ఉన్నార‌ని ల‌క్ష్మీదేవి చెబుతున్నారు. కుమారుడు శివచరణ్‌రెడ్డిని బాగా చూసుకునేవారని, ఇప్పుడేమో డబ్బు కోసం వచ్చామని అబద్ధాలాడుతూ అవమానిస్తున్నారన్నార‌ని ఆరోపించారు. చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో అవమానం భరించలేక, ఇన్నేళ్ల తర్వాత బయటకు రావాల్సి వచ్చింది ఆమె వివ‌రిస్తున్నారు. డబ్బు కోసం వచ్చావని చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి మాట్లాడటం సరికాదని, ఎవరి దగ్గర ఎంత డబ్బుందో! ప్రజలు అన్నీ గమనిస్తున్నార‌ని అన్నారు. ఆ మేరకు ఆమె విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

డీఎన్ ఏ టెస్ట్ కు ఆయ‌న..

నెల్లూరు జిల్లాలో పేరుమోసిన కుటుంబంగా మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి రాజ‌కీయాల‌ను నెరుపుతున్నారు. పైగా ఆ కుంటుంబానికి చాలా కాలంగా వ్యాపారాలు, కాంట్రాక్టులు ఉన్నాయి. రెండు ద‌శాబ్దాల‌కు పైగా రాజ‌కీయాల‌ను న‌డుపుతున్నారు. అంద‌రికీ సుప‌రిచ‌య‌మైన ఫ్యామిలీ. ప్ర‌స్తుతం సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి అత్యంత స‌న్నిహితంగా ఉండే కుటుంబం కూడా. ఇలాంటి ఫ్యామిలీ కి చెందిన చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి మీద రెండు వారాలుగా స‌రికొత్త ఫ్యామిలీ డ్రామా న‌డుస్తోంది. ఇప్పుడు డీఎన్ ఏ టెస్ట్ కు ఆయ‌న సిద్ధ‌ప‌డే ప‌రిస్థితి వ‌చ్చింది.