Site icon HashtagU Telugu

YCP Corporators : జనసేనలోకి వైసీపీ కార్పొరేటర్లు

Ycp Corporators Joins Janas

Ycp Corporators Joins Janas

ఒంగోలు(Ongole)లో వైసీపీ బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సమక్షంలో ఆ పార్టీలో వైసీపీ కార్పొరేటర్లు (YCP Corporators) చేరనున్నారు. ఒంగోలు కార్పొరేషన్‌లో 20 మంది వైసీపీ కార్పొరేటర్లతోపాటు ముగ్గురు కో ఆప్షన్ సభ్యులు జనసేనలో చేరబోతున్నారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేయడంతోనే.. ఒంగోలులో ఆ పార్టీ నిర్వీర్యమైందనే వాదన వినిపిస్తోంది. అనంతరం ఆయన వైసీపీ ఖాళీ చేయించే పనిలో ఉన్నారని సమాచారం.

Tollywood : యంగ్ ప్రొడ్యూసర్ మృతి

గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంగోలు కార్పొరేషన్‌లో 41 మంది వైసీపీ కార్పొరేటర్లు, మేయర్ గెలుపొందారు. అయితే ఎన్నికల అనంతరం 19 మంది కార్పొరేటర్లు, మేయర్ కలిసి.. టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. దీంతో మిగిలిన కార్పొరేటర్లు.. బాలినేని శ్రీనివాసరెడ్డి టచ్‌లోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో వారంత ఈ రోజు జనసేన పార్టీలో చేరనున్నారు. జనసేనలో చేరుతోన్న ఈ కార్పొరేటర్లకు ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు.

MAD Square : ‘మ్యాడ్ స్క్వేర్’ టీజర్ చూసారా..?

మరోవైపు వైసీపీలో అసంతృప్తిగా ఉన్న నేతలతో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వరుస చర్చలు జరుపుతోన్నారు. ఆ క్రమంలో పలువురు జనసేనలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. అసంతృప్తి నేతలను హైదరాబాద్ పిలుపించుకొని వారితో చర్చించి.. జనసేనలో చేరేలా వారిని ఒప్పిస్తున్నారు. దీంతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీని ఖాళీ చేయాలనే ఓ విధమైన లక్ష్యంలో బాలినేని ముందుకు వెళ్తున్నారనే ఓ చర్చ సైతం జిల్లా వ్యాప్తంగా సాగుతోంది.