Whats Today : ఇద్దరు కేంద్రమంత్రుల పర్యటన.. గవర్నర్ ప్రసంగంపై అసెంబ్లీలో చర్చ

Whats Today : ఈరోజు నుంచి తిరుపతి ఎయిర్‌పోర్టులో శ్రీవాణి దర్శన టికెట్ల కౌంటర్ మూసివేస్తారు.

  • Written By:
  • Publish Date - December 16, 2023 / 08:09 AM IST

Whats Today : ఈరోజు నుంచి తిరుపతి ఎయిర్‌పోర్టులో శ్రీవాణి దర్శన టికెట్ల కౌంటర్ మూసివేస్తారు. ఇవాళ్టి నుంచి గోకుల్ ఆతిథి గృహంలో ప్రత్యేక కౌంటర్ ద్వారా శ్రీవాణి టికెట్లను జారీ చేస్తారు.

We’re now on WhatsApp. Click to Join.

  • గవర్నర్ ప్రసంగంపై ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో చర్చిస్తారు. బీఆర్ఎస్ నుంచి చర్చలో కేటీఆర్, తలసాని పాల్గొంటారు. తెలంగాణ శాసన మండలి నుంచి చర్చలో మధుసూదనాచారి, దేశపతి శ్రీనివాస్ పాల్గొంటారు.
  • ఈరోజు జనసేన పార్టీ నేత నాగబాబు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని నియోజకవర్గాలవారీ సమీక్ష సమావేశాలను నిర్వహిస్తారు.
  • ఇవాళ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం సమీపంలోని గ్రీన్ ఫీల్డ్ హైవే పనులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పరిశీలిస్తారు. అనంతరం బీజెపీ బూత్ స్వశక్తికరణ జిల్లా సమావేశం, ఏలూరు జిల్లా బీజెపీ కార్యవర్గ సమావేశాలకు హాజరవుతారు.
  • ఇవాళ కర్నూలు జిల్లా కోడుమూరులో వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో కేంద్ర మంత్రి దేవ్ సిన్హ్ చౌహన్ పాల్గొంటారు.
  • ఇవాళ(Whats Today) కర్నూలు జిల్లా కరప మండలం నడకుదురులో వికసిత భారత్ సంకల్పయాత్రలో కేంద్రమంత్రి సోం ప్రకాష్ పాల్గొంటారు.

Also Read: Rs 500 Gas Cylinder : జనవరి మొదటివారంలో రూ.500 గ్యాస్ సిలిండర్ స్కీమ్ ?!