Site icon HashtagU Telugu

Metro : 2028 నాటికి విశాఖ, విజయవాడ మెట్రోలు

L&T Metro

L&T Metro

ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (APMRCL) రాష్ట్రంలోని మెట్రో ప్రాజెక్టులపై పనులను వేగవంతం చేస్తోంది. విశాఖపట్నం, విజయవాడ నగరాలకు మెట్రో రైల్ ఒక మైలురాయి అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో APMRCL మేనేజింగ్ డైరెక్టర్ రామకృష్ణారెడ్డి టెండర్ల వివరాలను వెల్లడించారు. గరిష్టంగా మూడు కంపెనీలు జాయింట్ వెంచర్ (JV) రూపంలో పాల్గొనేలా అవకాశం కల్పించామని ఆయన తెలిపారు. దీనివల్ల మరింత పోటీ పెరిగి, నాణ్యతా ప్రమాణాలతో పనులు జరగనున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం విశాఖలో 46.23 కిలోమీటర్ల మేర, విజయవాడలో 38 కిలోమీటర్ల మేర మెట్రో పనులు చేపట్టనున్నారు. ఇందులో 40 శాతం సివిల్ వర్కులకు ఇప్పటికే టెండర్లు పిలిచామని రామకృష్ణారెడ్డి తెలిపారు. టెండర్ దాఖలు కోసం విశాఖకు అక్టోబర్ 10, విజయవాడకు అక్టోబర్ 14 తుదిగడువుగా నిర్ణయించారు. ఈ రెండు నగరాల్లో మెట్రో రైల్ రూపుదిద్దుకుంటే, ట్రాఫిక్ సమస్యలు తగ్గిపోవడంతో పాటు పర్యావరణహితం గల రవాణా సౌకర్యం లభించనుంది.

Tandur Govt Hospital : సీఎం రేవంత్ ఇలాకాలో దారుణం

రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు మెట్రో ప్రాజెక్టులను రికార్డు స్థాయిలో వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించింది. 2028 నాటికి విశాఖ, విజయవాడ మెట్రోలను ప్రజల సేవలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టులు సమయానికి పూర్తైతే ఆర్థికాభివృద్ధికి తోడ్పడటమే కాకుండా, నగరాల రూపురేఖలు మారిపోతాయి. ఉద్యోగావకాశాలు పెరుగుతాయి, పర్యాటకానికి కూడా ఊతమిస్తుంది. అందువల్ల ప్రజలు, వ్యాపార వర్గాలు, విద్యార్థులు, ఉద్యోగులు అన్నివర్గాలకీ ఈ మెట్రో ప్రాజెక్టులు ఎంతో ఉపయోగకరంగా మారనున్నాయి.

Exit mobile version