Site icon HashtagU Telugu

Vijayasai Reddy : రాజకీయాలకు విజయసాయిరెడ్డి గుడ్ బై..?

Vijayasai Reddy Goodbye To Politics

Vijayasai Reddy Goodbye To Politics

Vijayasai Reddy : వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు తెలిపారు. శనివారం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణాలేమిటన్నది ఆయన ఇంకా బయట పెట్టలేదు. రాజీనామా చేసిన తర్వాత ప్రకటించే అవకాశం ఉంది. ఈ అంశంపై ఆయన ఎక్స్‌లో ట్వీట్ పెట్టారు.

ఏ రాజకీయపార్టీ లోను చేరడంలేదు. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేరడంలేదని చెప్పారు. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తి గతం. ఎలాంటి ఒత్తిళ్లు లేవు. ఎవరూ ప్రభావితం చెయ్యలేదని ట్వీట్‌లో తెలిపారు. నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైయస్ కుటుంబానికి రుణపడి ఉన్నానునని.. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ నన్ను ఇంతటి ఉన్నతస్థాయికి తీసుకెళ్ళిన భారతికి సదా కృతజ్ఞుడిననని విజయసాయిరెడ్డి ప్రకటించారు.

జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నా. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశా. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశా. దాదాపు తొమ్మిది సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్నిచ్చి తెలుగురాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోడీ గారికి, హోం మంత్రి అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు. టీడీపీతో రాజకీయంగా విభేదించా. చంద్రబాబు గారి కుటుంబంతో వ్యక్తి గతంగా విభేదాలు లేవు. పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం ఉందన్నారు. నా భవిష్యత్తు వ్యవసాయం. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన నా రాష్ట్ర ప్రజలకి, మిత్రులకి, సహచరులకి, పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికీ పేరు పేరునా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నానని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Read Also: Dubai : దుబాయ్‌లో ఔట్ డోర్ సాహసాలు..