VH Meets CBN : చంద్రబాబు తో వీహెచ్‌ భేటీ

VH Meets CBN : దివంగత నేత దామోదరం సంజీవయ్య (Damodaram Sanjeevaiah) పేరును ఏపీ లోని ఒక జిల్లాకు పెట్టాలని, అలాగే ఆయన స్మృతివనాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రికి సూచించారు

Published By: HashtagU Telugu Desk
Vh Meets Cbn

Vh Meets Cbn

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు (Telangana Congress veteran V Hanumanth Rao) తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu)ను విజయవాడలో కలిశారు. ఈ సమావేశంలో హనుమంతరావు, దివంగత నేత దామోదరం సంజీవయ్య (Damodaram Sanjeevaiah) పేరును ఏపీ లోని ఒక జిల్లాకు పెట్టాలని, అలాగే ఆయన స్మృతివనాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రికి సూచించారు. దీనిపై చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. హనుమంతరావు మాట్లాడుతూ.. సంజీవయ్యలు దళిత నాయకుడు కావడం మాత్రమే కాదు, నిజాయితీ మరియు ప్రజాసేవలో తన గుణాలను ప్రతిబింబించారని అభిప్రాయపడ్డారు.

Tuni Municipality : తుని మున్సిపాలిటీలో వైసీపీకి భారీ షాక్

దామోదరం సంజీవయ్య పట్ల వీహెచ్ అశేష గౌరవం చూపుతూ, ఆయన నాయకత్వం మరియు సామాజిక సేవా దృక్పథాన్ని పొగడుతూ చెప్పారు. 1970 వ దశకంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవలు ఇప్పటికీ ప్రజల హృదయాలలో నిలిచిపోయాయని హనుమంతరావు అన్నారు. ముఖ్యంగా, దళిత సంఘాల కోసం సంజీవయ్య చేసిన పోరాటాలు, ఆయన జీవితం సమాజానికి వెలుగులు చూపించినట్టు ఆయన అభిప్రాయపడ్డారు.

Vallabhaneni Vamshi : 10 కోట్లు విలువైన స్థలం కబ్జా చేసారంటూ వంశీ పై కేసు

హనుమంతరావు.. చంద్రబాబుతో జరిగిన సమావేశం, రాజకీయ చర్చలకు కొత్త కోణాన్ని తెస్తూ, సంజీవయ్యకు సమాజంలో మరింత గుర్తింపు ఇస్తుందని భావిస్తున్నారు. కాగా స్మృతివనం నిర్మాణం మరియు జిల్లాకు సంజీవయ్య పేరును పెట్టడం పట్ల ప్రజల నుంచి కూడా సానుకూల స్పందన రావొచ్చని అంత మాట్లాడుకుంటున్నారు.

  Last Updated: 25 Feb 2025, 01:56 PM IST