Site icon HashtagU Telugu

Jagan Tadepalli House : ఇంటి వాస్తు.. జగన్‌ లో ఓటమి భయం పుట్టించిందా..?

Jagan Tadepalli House

Jagan Tadepalli House

175 కు 175 కొట్టేస్తున్నాం.. సింహం సింగిల్ గా వస్తాది.. మరోసారి రాష్ట్ర ప్రజలు వైసీపీ (YCP) ని భారీ మెజార్టీ తో గెలిపించబోతున్నారు..వైసీపీ కి తిరుగులేదు..ఇలా 15 రోజుల క్రితం వరకు సీఎం జగన్ దగ్గరి నుండి కింది స్థాయి నేతల వరకు అంత చెప్పుకుంటూ వచ్చారు..కానీ ఇప్పుడు వారందరిలో ఓటమి భయం పట్టుకుంది. ప్రజలంతా కూటమి వైపే మొగ్గు చూపిస్తుండడం..కూటమి అభ్యర్థులు ప్రచారంలో వైసీపీ నేతలు చేసిన నేరాలు , కబ్జాలు , దారుణాలన్నీ ప్రజలను వివరిస్తూ వస్తుండడంతో ప్రజలంతా ఈసారి కూటమికే మా మద్దతు అని తేల్చి చెపుతున్నారు. దీంతో వైసీపీ నేతల్లో భయం మొదలైంది. దీనికంతటికి కారణం తాడేపల్లి ప్యాలెస్‌ లో వాస్తు దోషం అని చాలామంది చెప్పడం తో.. జగన్ వాస్తు నిఫుణులను రప్పించి దోషాలను పరిష్కరించే పనిలో పడ్డారని అంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

గురువారం సీఎం జగన్ తాడేపల్లి ప్యాలెస్‌ (Tadepalli House)లో ఉండి.. వాస్తు (Vastu ) నిఫుణులతో చర్చించారట. ఇళ్లంతా తిరిగి ఈశాన్యంగా బరువు పెరిగిందని, దీనివల్ల చాలా ఇబ్బందులు ఉంటాయని వారు చెప్పారట. అందుకు కొన్ని సూచనలు చేయడంతో వెంట వెంటనే పని మొదలుపెట్టారని తెలుస్తుంది. తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ కట్టిన ఇనుప కంచెను ఈశాన్యంలో కొంతభాగం తొలగించాలని వాస్తు నిపుణులు చెప్పడంతో వెంటనే దాన్ని తొలగించడం చకచకా జరిగిపోయిందని క్యాంపు కార్యాలయం వర్గాలు అంటున్నాయి. కార్మికులు ఇంటికి వచ్చి పనులు చేయడం, వాటిని దగ్గరుండి సీఎం జగన్ పర్యవేక్షించినట్టు తెలుస్తోంది. ఇకపై అంతా బాగానే ఉంటుందని వైసీపీ అధినేత జగన్ లెక్కలు వేసుకుంటున్నారు. అయితే వాస్తు సరిచేసినంత మాత్రాన వెంటనే కలిసివస్తుందా అని ఈ వార్త తెలిసిన వారు అంటున్నారు. ఎన్నికల పోలింగ్ కేవలం ఎనిమిది రోజులు మాత్రమే ఉన్నాయని, ఈ వారంలో ఆయా సమస్యలకు ఫుల్‌స్టాప్ పడుతుందా..? ఇలా జరిగితే ప్రతి ఒక్కరు తమ ఇంటిని మార్చుకునే పనిలోనే ఉంటారని చెపుతున్నారు. మరి నిత్యం యాగాలు చేసే కేసీఆర్ పార్టీ ఎందుకు ఓడిపోయిందని..పదేళ్ల పాటు తెలంగాణ ను ఎంతో అభివృద్ధి చేసిన ఆయన్నే అక్కడి ప్రజలు ఓడించారని..అలాంటిది ఐదేళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ ను ఓడించకుండా ఉంటారా అని మరికొంతమంది మాట్లాడుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికి జగన్ లో మాత్రం ఓటమి భయం మొదలైందనేది సత్యం అని ప్రతి ఒక్కరు అంటున్న మాట.

Read Also : Petrol Bikes: అధిక మైలేజీ ఇస్తున్న బైక్‌లు ఇవే.. ధ‌ర కూడా త‌క్కువే..!