TTD : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్…రేపు ప్రత్యేక ప్రవేశం దర్శనానికి టికెట్ల విడుదల..!!

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. అక్టోబర్ నెలకుగాను గురువారం రూ 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను రిలీజ్ చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది.

  • Written By:
  • Publish Date - August 17, 2022 / 08:43 AM IST

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. అక్టోబర్ నెలకుగాను గురువారం రూ 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను రిలీజ్ చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. రేపు ఉదయం తొమ్మిది గంటల నుంచి టీటీడీ వెబ్ సైట్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. అదే నెలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు కూడా జరగనున్నాయి. ఉత్సవాల సమయంలో సర్వదర్శనం మాత్రమే ఉంటుందని టీటీడీ ప్రకటించింది. కాబట్టి బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను నిలివేశారు. కాబట్టి టికెట్లను బుక్ చేసుకునే భక్తులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని అధికారులు తెలిపారు.

రెండు సంవత్సరాల తర్వాత మొదటిసారి శ్రీవారి బ్రహ్మోత్సవాలు భక్తుల మధ్య నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఉత్సవాల సందర్భంగా 9రోజుల పాటు ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఇప్పటికే ప్రకటించింది. సెప్టెంబర్ 27న ధ్వజారోహణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి సీఎం జగన్ పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. అక్టోబర్ 1న గరుడవాహన సేవ, 5న స్వామివారికి చక్రస్నానం నిర్వహిస్తారు.