Richest Ministers: ప్రస్తుతం రాజకీయ నాయకులకు ఉండాల్సిన ప్రాథమిక అవసరాలలో భారీ ఆర్థిక నేపథ్యం ఒకటి. దీనికి అనుగుణంగానే భారత రాజకీయాల్లో దేశంలోని అత్యంత ధనవంతులైన వ్యక్తులు అడుగుపెడుతుండటాన్ని మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి రాష్ట్ర, కేంద్ర కేబినెట్లలో కలిపి భారతదేశంలోని టాప్ 10 అత్యంత ధనవంతులైన మంత్రుల జాబితాను ఒకసారి చూద్దాం..!
టాప్-10 రిచెస్ట్ మినిస్టర్స్
- చంద్రశేఖర్ పెమ్మసాని- రూ. 5,705 కోట్లు
- డి.కె. శివకుమార్- రూ. 1,413 కోట్లు
- చంద్రబాబు నాయుడు- రూ. 931.84 కోట్లు
- నారాయణ పొంగూరు- రూ. 824 కోట్లు
- సురేష్ బి.ఎస్- రూ. 684 కోట్లు
- గడ్డం వివేకానంద- రూ. 606 కోట్లు
- నారా లోకేష్- రూ. 542 కోట్లు
- మంగళ్ లోధా- రూ. 447 కోట్లు
- పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి- రూ. 433 కోట్లు
- జ్యోతిరాదిత్య సింధియా- రూ. 424 కోట్లు
Also Read: యేసు క్రీస్తు స్వతహాగా భారతీయుడా? అసలు నిజం ఇదే!
ఈ జాబితాలో అత్యంత ధనవంతుడు నిస్సందేహంగా పెమ్మసాని చంద్రశేఖర్. ఆయన టీడీపీ ఎంపీ, కేంద్ర కేబినెట్ సభ్యుడు. రాజకీయాల్లోకి రాకముందే అమెరికాలో ఆయనకు ఉన్న వైద్య వ్యాపారాలు ఈ భారీ సంపదకు ప్రధాన కారణం. తర్వాతి స్థానాల్లో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు. చంద్రబాబు విషయానికి వస్తే.. ఆయన కుటుంబానికి ప్రపంచంలోని అతి ముఖ్యమైన డెయిరీ కంపెనీలలో ఒకటైన ‘హెరిటేజ్’ ఉంది.
ఈ జాబితాలో మంగళ్ లోధా, జ్యోతిరాదిత్య సింధియా మాత్రమే ఉత్తర భారతీయులు కాగా, మిగిలిన ఎనిమిది మంది సభ్యులు దక్షిణ భారతదేశానికి చెందినవారే. సంపన్న మంత్రుల జాబితాలో దక్షిణ భారత ప్రతినిధులదే స్పష్టమైన ఆధిపత్యం కనిపిస్తోంది.
