Site icon HashtagU Telugu

YS Viveka : సాక్షుల మరణాలపై అనుమానం ఉంది.. వైఎస్ సునీత సంచలన వ్యాఖ్యలు

Ys Vivekananda Reddy Death Anniversary Ys Sunitha Reddy

YS Viveka : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై ఆయన కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సాక్షుల మరణాలపై తమకు అనుమానం ఉందని ఆమె తెలిపారు.  ఈ కేసులోని సాక్షులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని సునీత ఆరోపించారు. న్యాయం జరిగేంత వరకు పోరాడుతూనే ఉంటానన్నారు. ఇవాళ వైఎస్ వివేకానందరెడ్డి 6వ వర్ధంతి. ఈ సందర్భంగా పులివెందులలోని సమాధుల తోటలో తండ్రి సమాధికి పూలమాల వేసి కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి, వైఎస్ ప్రకాశ్ రెడ్డి తదితరులు నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో సునీత మాట్లాడారు.

Also Read :Men Vs Marriage : పురుషుల బరువుకు పెళ్లితో లింకు.. సంచలన నివేదిక

నిందితులంతా బయటే తిరుగుతున్నారు

‘‘మా నాన్న హత్యకు గురై ఆరేళ్లు అయింది. ఈ కేసులో ఇంకా మాకు న్యాయం జరగలేదు. సీబీఐ కోర్టులో విచారణ కూడా ప్రారంభం కాలేదు. నిందితుల్లో ఒకరు తప్ప మిగితా వాళ్లంతా బయటే తిరుగుతున్నారు. ఈ కేసులో సీబీఐ మళ్లీ దర్యాప్తు మొదలు పెడుతుందని ఆశిస్తున్నా. సీబీఐ దర్యాప్తు ముందుకు సాగకుండా నిందితులైన వారు మేనేజ్ చేస్తున్నారనే అనుమానం వస్తోంది’’ అని వైఎస్ సునీతా రెడ్డి పేర్కొన్నారు.‘‘ఈ కేసులో నిందితుల కంటే.. మాకు, మా కుటుంబానికే ఎక్కువ శిక్ష పడుతున్నట్లు అనిపిస్తోంది. సాక్షులను, నిందితులను కాపాడే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి’’ అని ఆమె తెలిపారు.

Also Read :Telangana Debts: తెలంగాణ అప్పులు, ఖర్చులు, ఆర్థిక లోటు.. కొత్త వివరాలివీ

హత్య.. దర్యాప్తు..