తిరుమల తిరుపతి దేవస్థానం రోజువారీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు తేల్చేసింది. ఆచార వ్యవహారాల్లో తిరుమల బోర్డు తప్పు చేస్తోందని ఓ భక్తుడు వేసిన పిటిషన్ పై హైకోర్టు ఇచ్చిన ఉత్వర్వులను సవాల్ చేస్తూ సుప్రీంలో వేసిన అప్పీల్ ను కొట్టివేసింది.సుప్రీం కోర్టు జోక్యం చేసువద్దని ఇష్టానుసారం నిర్వహకులు చేయడానికి లేదని స్పష్టం చేసింది. ఎనిమిది వారాల్లోగా సరైన సమాధానం పిటిషనర్ కు ఇవ్వాలని సూచించింది. ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ, న్యాయమూర్తులు సూర్యకాంత్, హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం ఆ మేరకు స్పష్టం చేసింది. ఇంకా ఏమైనా ఫిర్యాదులుంటే తగిన ఫోరమ్ను సంప్రదించవచ్చని పేర్కొంది.
నిత్యం జరిగే కైంకర్యాలు, పూజలు కాకుండా ఇరతత్రా ఫిర్యాదులపై విచారణ చేయడానికి కోర్టు సిద్ధంగా ఉందని వివరించింది. కేవలం పరిపాలన పరమైన అంశాల్లో మాత్రమే రాజ్యాంగం ప్రకారం జోక్యం చేసుకోగలమని, సేవల విషయంలో పిటిషన్లను స్వీకరించలేమని తేల్చేసింది.
Also Read : జడ్జిలకు `అమరావతి` ఓ ఛాలెంజ్
పిటిషనర్ దాదా ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించింది, అయితే జనవరి 5న “ఆచారాలు నిర్వహించే విధానం దేవస్థానం యొక్క ప్రత్యేక డొమైన్ మరియు ఇది ఇతరుల లౌకిక లేదా పౌర హక్కులపై ప్రభావం చూపకపోతే అది తీర్పుకు సంబంధించిన అంశం కాదు” అని జనవరి 5న తన పిటిషన్ను తోసిపుచ్చింది. ఆచారాలను నిర్వహించే విషయంలో దేవస్థానం ప్రభుత్వ విధులను నిర్వర్తిస్తున్నట్లు చెప్పలేమని, అందువల్ల, మతపరమైన డొమైన్ పరిధిలోకి వచ్చే అటువంటి కార్యకలాపాలు బయటి వ్యక్తి యొక్క ఆదేశానుసారం అధికార పరిధిని రిట్ చేయడానికి అనుకూలం కాదని సుప్రీం వివరించింది.
Also Read : గయ్యాళిఅత్తకు అరుదైన గుర్తింపు.. తపాలాశాఖ ప్రత్యేక కవరు!