Tirumala – December : ఏడాదిలో చివరి నెల కావడంతో ఏటా డిసెంబరులో తిరుమల శ్రీవారిని పెద్దసంఖ్యలో భక్తజనం దర్శించుకుంటుంటారు. యావత్ దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. నిత్యం గోవింద నామ స్మరణతో తిరుమల కొండలు మార్మోగుతాయి. ఈ నేపథ్యంలో డిసెంబర్ నెలలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాల వివరాలను టీటీడీ విడుదల చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
- డిసెంబరు 3న పార్వేట మండపంలో కార్తీక వన భోజన ఉత్సవం జరుగుతుంది.
- డిసెంబరు 8న సర్వ ఏకాదశి నిర్వహిస్తారు.
- డిసెంబరు 12న అధ్యయనోత్సవాలు ప్రారంభమవుతాయి.
- డిసెంబరు 17న ధనుర్మాస ఉత్సవాలు జరుగుతాయి.
- డిసెంబరు 22న తిరుమల శ్రీవారి సన్నిధిలో చిన్న శాత్తుమొర ఉత్సవాలు ఉంటాయి.
- డిసెంబరు 23న వైకుంఠ ఏకాదశి ప్రారంభమవుతుంది. అనంతరం శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమవుతుంది. ఆ రోజున ఆ ఏడు కొండలవాడిని తనివితీరా చూడాలని భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు.
- సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, వర్చువల్ సేవా దర్శనం, ఆర్జిత సేవా దర్శనం, వీఐపీ బ్రేక్ దర్శనం వంటి మార్గాల్లో తిరుమల శ్రీవారిని(Tirumala – December) దర్శించుకోవచ్చు.