ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎలక్టోరల్ బాండ్ల (Electoral Bond Data) గురించే చర్చ నడుస్తుంది. ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసిన వారి పేర్లను బయటపెట్టాలని సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాలు జారీ చేయడంతో ఆ వివరాల జాబితాలను ఒక్కోటిగా బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని బిఆర్ఎస్ (BRS) , టీడీపీ (TDP) , వైసీపీ (YCP) పార్టీలకు పెద్ద ఎత్తున విరాళాలు అందినట్లు తేలాయి.
ఎన్నికల బాండ్ల (Electoral Bonds) ద్వారా అత్యధిక విరాళాలు పొందిన టాప్-4 రాజకీయ పార్టీల్లో 4వ స్థానంలో బిఆర్ఎస్ పార్టీ ఉంది. ఎన్నికల బాండ్ల రూపంలో ఆ పార్టీకి వచ్చిన మొత్తం విరాళాలు రూ.1,322 కోట్లు కాగా.. అందులో సగానికిపైగా విరాళాలు (రూ.663 కోట్లు.. అంటే 50.15ు) నాలుగు రోజుల్లోనే వచ్చాయి! ఒకరోజైతే ఏకంగా రూ.268 కోట్ల విలువైన బాండ్లు ఆ పార్టీకి వచ్చిపడ్డాయి. ఎన్నికల కమిషన్కు స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా సమర్పించిన వివరాల ప్రకారం.. యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బీఆర్ఎస్ పార్టీకి రూ.94 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు తేలింది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ఒక నెల ముందు కూడా విరాళం ఇచ్చింది.
We’re now on WhatsApp. Click to Join.
* ‘MEIL’ రూ.195 కోట్లు
* చెన్నై గ్రీన్వుడ్స్ ప్రై. లిమిటెడ్ రూ.50 కోట్లు
* డా. రెడ్డీస్ ల్యాబ్స్ రూ.32 కోట్లు
* హెటిరో డ్రగ్స్ రూ.30 కోట్లు
* హెటిరో ల్యాబ్స్ రూ.20 కోట్లు
* DIVIS ల్యాబ్స్ రూ.20 కోట్లు బిఆర్ఎస్ కు అందించాయి.
ఏపీలోని అధికార పార్టీ వైసీపీ (YCP Electoral Bonds) సైతం తక్కువేం కాదు..ఈ పార్టీ కి కూడా భారీ ఎత్తున విరాళాలు అందజేశారు.
* ఫ్యూచర్ గేమింగ్ & హోటల్ సర్వీసెస్ – రూ.150కోట్లు
* మేఘా ఇంజినీరింగ్ – రూ. 37కోట్లు
* రామ్కో సిమెంట్స్ – రూ.24కోట్లు
* ఓస్ట్రో మాధ్య విండ్ ప్రైవేట్ లిమిటెడ్ – రూ.17కోట్లు
* ఓస్ట్రో జైసల్మేర్ ప్రైవేట్ లిమిటెడ్ – రూ.17కోట్లు
* స్నేహ కైనెటిక్ పవర్ ప్రాజెక్ట్స్ – రూ.10కోట్లు అందజేశాయి.
ఇక ఏపీ ప్రతిపక్ష పార్టీ టీడీపీ (TDP Electoral Bonds) కి అందిన విరాళాలు చూస్తే..
• షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్- రూ .40కోట్లు
• మేఘా ఇంజినీరింగ్ – రూ .28కోట్లు
• వెస్టర్న్ యూపీ పవర్ ట్రాన్స్ మిషన్ -రూ .20కోట్లు
నాట్కో ఫార్మా -రూ .14కోట్లు
డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్- రూ .13కోట్లు
భారత్ బయోటెక్ – రూ .10కోట్లు అందజేశాయి.
Read Also : Raghav Chadha : ప్రజాస్వామ్యం తీవ్ర ప్రమాదంలో ఉంది