AP Exams: మార్చి నెలలో పది, ఇంటర్‌ పరీక్షలు : ఏపీ మంత్రి బొత్స

ఏపీ మంత్రి పది, ఇంటర్ పరీక్షలకు సంబంధించిన కీలక ప్రకటన చేశారు.

  • Written By:
  • Updated On - December 14, 2023 / 06:10 PM IST

AP Exams: ఆంధ్రప్రదేశ్ లో మార్చి నెలలో పది, ఇంటర్‌ పరీక్షలు నిర్వహించబోతున్నట్లు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. మార్చి 3 నుంచి పదో తరగతి, మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 5 నుంచి 20 వరకు ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ పరీక్షలు జరగనున్నాయని పేర్కొన్నారు. ఇంటర్ విద్యార్థులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్టు మంత్రి బొత్స తెలిపారు.

ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మార్చి 31వ తేదీలోగా పరీక్షలు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఏపీలో 6 లక్షల మంది 10 వతరగతి విద్యార్థులు, 10 లక్షల మంది ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని మంత్రి తెలిపారు.

Also Read: Kashmir: ఎలుగుబంటి దాడిలో 18 గొర్రెలు మృతి, 25మందికి గాయాలు