ఏపీలో 175 అసెంబ్లీ , 25 పార్లమెంట్ స్థానాలకు సంబదించిన ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుండే ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోటీ పడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పోలింగ్ శాతం ఉండబోతుందని ఈసీ అధికారులు , రాజకీయ ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అన్ని పార్టీల అధినేతలు , అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకొని అందరు ఓటు వేయాలని కోరడం జరిగింది.
We’re now on WhatsApp. Click to Join.
ఈ క్రమంలో టీడీపీ పార్టీ తన సోషల్ మీడియా పేజీ ట్విట్టర్ X లో జగన్ ఫై సెటైర్ వేసింది. ‘చంద్రబాబు.. చంద్రబాబు.. చంద్రబాబు..కళ్ళు తెరిచిన మూసిన జగన్కు చంద్రబాబు ఆలోచనే. ఆ పిచ్చతోనే సైకిల్కి ఓటు గుద్దేసిన జగన్ ?’ అంటూ ట్వీట్ చేసింది.
ఈసారి ఎన్నికల్లో టీడీపీ , జనసేన, బిజెపి పార్టీలు కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. మూడు పార్టీలు కలిసి ప్రచారం చేసాయి. ఒకోరి అభ్యర్థులకు మరొకరు ప్రచారం చేసి కార్యకర్తల్లో, ప్రజల్లో నమ్మకం పెంచారు. ప్రచార సభల్లో కూడా తమ హామీలను వివరిస్తూనే..సీఎం జగన్ ఫై విమర్శలు , ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలిచారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు జగన్ ఫై ఓ రేంజ్ లో నిప్పులు చెరుగుతూ వచ్చారు.
చంద్రబాబు.. చంద్రబాబు.. చంద్రబాబు..
కళ్ళు తెరిచిన మూసిన జగన్కు చంద్రబాబు ఆలోచనే. ఆ పిచ్చతోనే సైకిల్కి ఓటు గుద్దేసిన జగన్ ? 🤣🤣#VoteForAlliance #VoteforCycle #VoteforJanarajyam #JaruguJagan pic.twitter.com/l4VqfPb2sL— Telugu Desam Party (@JaiTDP) May 13, 2024
Read Also : AP Poll : ఏపీ ఎన్నికల వేళ కేంద్ర మంత్రి అమిత్ షా కీలక ట్వీట్..