విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకి చురకలు అంటించారు. మైలవరం నియోజకవర్గంలోని కొండపల్లిలో కబడ్డీ పోటీలకు ముఖ్య అతిధిగా కేశినేని నాని హాజరైయ్యారు. గత 3రోజులుగా బొమ్మసాని సుబ్బారావు ఆధ్వర్యంలో కొండపల్లి బ్యాంక్ సెంటర్ లోనియోజకవర్గ స్థాయి కబడ్డీ పోటీలు జరిగాయి. పోటీల్లో గెలిచిన వారికి ఎంపీ కేశినేని నాని బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని హాట్ కామెంట్స్ చేశారు. పార్టీ అధికారంలోకి రావాలి అంటే సీనియర్లు త్యాగం చేయాలని… గెలుపు గురాల్ని ముందు పెట్టాలన్నారు. ఏదైనా ఎన్నికల మూడు నెలల ముందు జరిగేనని.. ఇపుడు సోషల్ మీడియాలో వచ్చేవి వాస్తవం కాదన్నారు. నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకు అందర్ని కలుపుకుపోవాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. అయితే నేను ఐ లవ్ యూ అవతలి వాళ్ళు ఐ హేట్ యూ అంటే కుదరదని.. రెండు పక్కల లవ్ ఉంటేనే ఏదైనా వీలవుతుందన్నారు. నేను తోపును అనుకుంటే పక్కనే ఉన్న కృష్ణానదిలో ప్రజలు ఇడుచ్చికెళ్ళి కొడతారంటూ కామెంట్స్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడు వైసీపీ నా టీడీపీ నా లేక న్యూట్రల్ గా ఉన్నాడా అని ఎంపీ కేశినేని నాని ప్రశ్నించారు.