Cheepurupalli : బొత్స ఫై పోటీకి వెనుకడుగు వేస్తున్న టీడీపీ నేతలు

  • Written By:
  • Publish Date - March 2, 2024 / 10:30 AM IST

ఏపీ(AP)లో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో అధికార – ప్రతిపక్ష పార్టీలు నేతల ఎంపిక ఫై కసరత్తులు చేస్తున్నారు. ఎవర్ని ఏ స్థానం నుండి దింపాలి..? దింపితే గెలిచే అవకాశం ఉంటుందా..? గతంలో ఏ పార్టీ కి ఎలాంటి విజయాలు అందాయి..? ప్రస్తుతం అక్కడి గ్రాఫ్ ఎలా ఉంది..? అనేవి చూసుకొని బరిలోకి దింపుతున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికలు గట్టి పోటీ ఉండబోతున్నట్లు స్ఫష్టంగా తెలుస్తుంది. టీడీపీ – జనసేన ఉమ్మడిగా బరిలోకి దిగుతుండడం..ఇదే క్రమంలో వైస్ షర్మిల కాంగ్రెస్ లో చేరడం..మరోపక్క వైసీపీ 175 కు 175 సాధించాలని కసరత్తులు చేయడం..అభ్యర్థుల ఎంపికలో సరికొత్త ఆలోచనలు చేస్తుండడం తో అందరిలో ఈసారి గెలుపు ఎవర్ని వరిస్తుందో అనే ఆసక్తి రోజు రోజుకు పెరుగుతుంది.

We’re now on WhatsApp. Click to Join.

విజయనగరం జిల్లా చీపురుపల్లి (Cheepurupalli)లో మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana)పై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivas)ను బరిలోకి దింపాలని టీడిపి (TDP) భావించింది. కానీ గంటా అక్కడి నుండి పోటీ చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు. ఇదే విషయాన్నీ అధిష్టానానికి తెలియజేయడం తో గంటా ప్లేస్ లో కళావెంకటరావు (Kala Venkata Rao) దించాలని అనుకున్నప్పటికీ ఆయన కూడా నో చెప్పడం తో మీసాల గీత ను దించేందుకు అధిష్టానం చూస్తుంది. ప్రస్తుతం చీపురుపల్లి టీడీపీ ఇంచార్జ్ గా నాగార్జున వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలన్నీ నాగార్జున దగ్గర ఉండి చూసుకుంటున్నారు. గత ఎన్నికల్లో బొత్స ఫై నాగార్జున పోటీ చేసి 20 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయినప్పటికీ నియోజకవర్గంలోనే ఉంటూ పార్టీ కార్యక్రమాలు చేస్తూ , ప్రజలకు దగ్గరగా ఉంటున్నారు. కాకపోతే బొత్స ఫ్యామిలీ ముందు నాగార్జున హావ చూపించలేకపోయారు. ఈ క్రమంలో టీడీపీ నియోజకవర్గంలో సర్వే చేయించగా పక్క నియోజకవర్గ నేత గీత పేరు ఎక్కువగా వినిపించింది. దీంతో అధిష్టానం గీత ను బొత్స ఫై బరిలోకి దింపితే ఎలా ఉంటుంది అనే ఆలోచన చేస్తుంది. దీనిపై అతి త్వరలోనే ప్రకటన రానుంది.

Read Also : Anant Ambani-Radhika: అనంత్ అంబానీ -రాధిక లవ్ స్టోరీ.. ఆసక్తికర విషయాలు తెలుసా