Tiruvuru TDP : తిరువూరు టీడీపీ ఇంచార్జ్‌పై కుర్చీల దాడి.. కేశినేని శివ‌నాథ్ ఫెక్సీలు చించేసిన ఎంపీ అనుచ‌రులు

తిరువూరు టీడీపీలో వ‌ర్గ‌పోరు వీధికెక్కింది. నియోజ‌క‌వ‌ర్గ కార్యాల‌య సాక్షిగా తెలుగు త‌మ్ముళ్లు త‌న్నుకున్నారు. చంద్ర‌బాబు

  • Written By:
  • Updated On - January 3, 2024 / 05:41 PM IST

తిరువూరు టీడీపీలో వ‌ర్గ‌పోరు వీధికెక్కింది. నియోజ‌క‌వ‌ర్గ కార్యాల‌య సాక్షిగా తెలుగు త‌మ్ముళ్లు త‌న్నుకున్నారు. చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న కోసం ఏర్పాటు చేసిన స‌మావేశం ప్రారంభంకాక‌ముందే తెలుగు త‌మ్ముళ్లు మ‌ధ్య వ‌ర్గ‌పోరు భ‌గ్గుమంది. ప్రోటోకాల్ ప్ర‌కారం పార్టీ ఇంఛార్జ్ వ్య‌వ‌హ‌రించ‌క‌పోవ‌డంతో ఎంపీ కేశినేని నాని వ‌ర్గం ఆందోళ‌న చేశారు. కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ఎంపీ కేశినేని నాని ఫోటోలు ఎక్క‌డా లేక‌పోవ‌డంతో నాని వ‌ర్గం అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. ఇంఛార్జ్ శావ‌ల దేవ‌ద‌త్ సైతం ఎంపీ ఫోటోలు లేకుండా కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్నారు. క‌నీసం ప్రోటోకాల్ పాటించ‌లేదు. కేశినేని నాని సోద‌రుడు చిన్ని ఫోటోల‌తో కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌డంపై అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. కార్యాల‌యంలో ఉన్న చిన్ని ఫ్లెక్సీల‌ను ఎంపీ అనుచ‌రులు చించేశారు. ఈ సంద‌ర్భంలో ఇరువురు మ‌ధ్య వాగ్వాదం చోటుచేస‌కుంది. అక్క‌డ ఉన్న టీడీపీ కార్య‌కర్త‌లు ఇంఛార్జ్ శావ‌ల దేవ‌ద‌త్‌పై కుర్చీలు విసిరారు. గో బ్యాక్ చిన్ని అంటూ నాని వ‌ర్గం నినాదాలు చేశారు. అయితే కేశినేని చిన్ని మాత్రం న‌గ‌ర శివారులోనే వేచి చూస్తున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమా వ‌చ్చిన త‌రువాత కార్య‌క్ర‌మానికి హాజ‌రుకావాల‌ని చూస్తున్నారు. కేశినేని చిన్ని వ‌స్తే కార్య‌క్ర‌మం మ‌రింత ర‌సాబాసాగా మారే అవ‌కాశం ఉంది.

Also Read:  TDP Joinings: విజయసాయిరెడ్డికి బిగ్ షాక్, టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే గడికోట!