Tirupati-Singapore Flights : తిరుపతి-సింగపూర్ విమాన సర్వీసులకు ప్రారంభం

Tirupati-Singapore flights : ఈ రోజు ఉదయం 5 గంటలకు MS లక్స్ ఏవియేషన్ సంస్థ నిర్వహించిన తొలి విమానం రేణిగుంట ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరింది. ఈ సర్వీసు ద్వారా విదేశాల నుంచి శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల ప్రయాణం మరింత సులభమైంది

Published By: HashtagU Telugu Desk
Start Of Tirupati Singapore

Start Of Tirupati Singapore

తిరుపతి నుంచి సింగపూర్ కు నేరుగా విమాన సర్వీసులు (Tirupati-Singapore Flights) ప్రారంభమవడం శ్రీవారి భక్తులకు (Tirumala Devotees) విశేష సంతోషాన్ని కలిగించింది. ఈ రోజు ఉదయం 5 గంటలకు MS లక్స్ ఏవియేషన్ సంస్థ నిర్వహించిన తొలి విమానం రేణిగుంట ఎయిర్‌పోర్ట్ (Renigunta Airport) నుంచి బయలుదేరింది. ఈ సర్వీసు ద్వారా విదేశాల నుంచి శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల ప్రయాణం మరింత సులభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) , కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) ఆదేశాలతో అంతర్జాతీయ విమాన సర్వీసుల రాకపోకలకే లక్ష్యంగా సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చామన్నారు ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్ శ్రీనివాసరావు.

ఇప్పటి వరకు శ్రీవారి దర్శనానికి సింగపూర్ వంటి దేశాల నుంచి వచ్చిన భక్తులు చెన్నై, బెంగళూరు, లేదా హైదరాబాద్ మీదుగా తిరుపతికి రావాల్సి వచ్చేది. ఇది వారికి ప్రయాణంలో సమయపాటుతో పాటు అధిక ఖర్చును కూడా కలిగించేది. కానీ ఇప్పుడు నేరుగా తిరుపతి చేరుకునే సౌకర్యం లభించడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ విమాన సర్వీసుల ప్రారంభానికి రేణిగుంట ఎయిర్‌పోర్ట్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలిసారి సింగపూర్ వెళ్లిన ప్రయాణికులకు ప్రత్యేక స్వాగతం పలికారు. ఈ కొత్త సర్వీసు తిరుమల తిరుపతి దేవస్థానానికి చేరువగా ఉండటంతో తీర ప్రాంత ప్రాంతాల అభివృద్ధికి కూడా తోడ్పడుతుంది. తిరుపతి నుండి సింగపూర్‌కు నేరుగా విమాన సర్వీసులు అందుబాటులోకి రావడం, ఇతర దేశాల్లో ఉన్న భక్తుల రాకపోకలను వేగవంతం చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.

Read Also : Congress Govt : రేవంత్ పాలన ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని తలపిస్తుంది – హరీష్ రావు

  Last Updated: 06 Dec 2024, 12:09 PM IST