10th Exams : పరీక్ష హాల్ లో తనిఖీకి వెళ్లిన అధికారిని కాటేసిన పాము

10th Exams : వేద స్కూల్లో పరీక్షల తనిఖీకి వెళ్లిన చీఫ్ సూపరిటెండెంట్ కరీముల్లా(Karimulla)ను పరీక్షా హాలులోనే పాము కాటేసింది

Published By: HashtagU Telugu Desk
Snake Bite

Snake Bite

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు (10th Exams) జరుగుతున్న వేళ, పరీక్షా హాలులో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట(Chilakaluripet In Palnadu District)లోని వేద స్కూల్లో పరీక్షల తనిఖీకి వెళ్లిన చీఫ్ సూపరిటెండెంట్ కరీముల్లా(Karimulla)ను పరీక్షా హాలులోనే పాము కాటేసింది(Snake Bite). విద్యార్థుల హాల్ టికెట్ నంబర్లు పరిశీలిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్కూలు సిబ్బంది వెంటనే స్పందించి ఆయన్ను చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటన విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన రేకెత్తించింది.

Pawan : పవన్ గురించి ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేస్తే బట్టలూడదీసి కొడతాం – కిరణ్ రాయల్

ఈ సంఘటనతో స్కూలు యాజమాన్యంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పరీక్షా హాలులో పాములు రాకుండా తగిన జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. పరీక్షా కేంద్రాలలో శుభ్రత మరియు విద్యార్థుల భద్రత పట్ల అధికారులు మరింత జాగ్రత్త వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే తరహాలో పరీక్షల ప్రారంభంలో అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మరో నిర్లక్ష్య ఘటన చోటుచేసుకుంది. అక్కడ విద్యార్థులు పరీక్ష రాయడానికి వచ్చినప్పుడు గదిలో సిమెంట్ బస్తాలు ఉండటంతో, వారు గది బయటే వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

DA Hike For Employees: ఉద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. 2 శాతం డీఏ పెంపు, జీతం ఎంత పెరుగుతుందంటే?

ఈ తరహా ఘటనలు విద్యార్థుల భద్రతపై ప్రశ్నార్థకంగా మారాయి. పరీక్షా హాలుల్లో అవసరమైన సౌకర్యాలు, భద్రతా చర్యలు తీసుకోకుండా స్కూలు యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్య, భద్రత పరంగా మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, పరీక్షా కేంద్రాలలో ముందస్తు తనిఖీలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

  Last Updated: 28 Mar 2025, 04:29 PM IST