రాజకీయాలు సొంత కుటుంబ సభ్యులను కూడా వేరు చేస్తాయని మరోసారి జగన్ , షర్మిల తో బయటపడింది. అన్న కోసం మూడున్నర వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి సీఎం గా కుర్చోపెడితే..ఈరోజు జగన్ ఏంచేసాడు..సొంత చెల్లె అని కూడా చూడకుండా ఆమెపై మాటల దాడి చేస్తూ , ఆమె పరువు తీస్తూ వస్తున్నారు. చెల్లెలుకు ఇవ్వాల్సిన ఆస్థి వాటాలు ఇవ్వకుండా..మొత్తం తానే ఉంచుకోవడంతో ఈరోజు షర్మిల రోడ్ మీదకు వచ్చి అన్నపైనే యుద్ధం చేస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఇప్పటికే ఇరువురు పలు ఆరోపణలు , విమర్శలు చేసుకోగా..తాజగా మరికొన్ని కీలక విషయాలని షర్మిల బయటపెట్టింది. చెల్లిని ఎంపీని చేస్తానని విజయమ్మకు జగన్ మాట ఇచ్చారన్నారు. కానీ ఆ మాట కూడా నిలబెట్టుకోలేదని ఆరోపించారు. తల్లికి ఇచ్చిన మాటనే నిలబెట్టుకోలేని జగన్ విలువలు, విశ్వసనీయత గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ జైల్లో ఉన్న సమయంలో మూడున్నర వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశాను. పార్టీలో అన్నీ తానై వ్యవహరించాను. కానీ ఎప్పుడూ ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనడం కానీ.. మరో రకమైన పదవిని కానీ ఆశించలేదు. వైసీపీలో ఎప్పుడూ ఎలాంటి పదవి ఇవ్వలేదు. అయితే తనను ఎంపీని చేస్తానని విజయమ్మకు జగన్ హామీ ఇచ్చినట్లుగా షర్మిల తెలిపారు. ప్రస్తుతం జగన్ మానసిక స్థితిపై తనకు ఆందోళన ఉందని షర్మిల వ్యాఖ్యలు చేయడం కొసమెరుపు.
Read Also : Telangana : రేవంత్ రెడ్డి ఓ దోకేబాజ్ – డీకే అరుణ