మదనపల్లెలో ఏడేళ్ల బాలిక హత్య..

Madanapalle అన్నమయ్య జిల్లా మదనపల్లెలో విషాదం జరిగింది. సోమవారం కనిపించకుండా పోయిన బాలిక మృతదేహం కనిపించింది. ఆ ఇంటికి సమీపంలోని ఓ వ్యక్తి ఇంట్లోని డ్రమ్ములో బాలిక డెడ్‌బాడీని గుర్తించారు. కులవర్ధన్ అనే వ్యక్తి బాలికను చంపినట్లు గుర్తించారు. వెంటనే అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. బాలిక మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ కోసం ఆస్పత్రికి తరలించారు. బాలిక మరణంతో తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో ఉన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో దారుణం అదృశ్యమైన బాలిక డెడ్‌బాడీ డ్రమ్ములో కులవర్దన్ అనే […]

Published By: HashtagU Telugu Desk
Madanapalle

Madanapalle

Madanapalle అన్నమయ్య జిల్లా మదనపల్లెలో విషాదం జరిగింది. సోమవారం కనిపించకుండా పోయిన బాలిక మృతదేహం కనిపించింది. ఆ ఇంటికి సమీపంలోని ఓ వ్యక్తి ఇంట్లోని డ్రమ్ములో బాలిక డెడ్‌బాడీని గుర్తించారు. కులవర్ధన్ అనే వ్యక్తి బాలికను చంపినట్లు గుర్తించారు. వెంటనే అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. బాలిక మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ కోసం ఆస్పత్రికి తరలించారు. బాలిక మరణంతో తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో ఉన్నారు.

  • అన్నమయ్య జిల్లా మదనపల్లెలో దారుణం
  • అదృశ్యమైన బాలిక డెడ్‌బాడీ డ్రమ్ములో
  • కులవర్దన్ అనే వ్యక్తి చంపినట్లు గుర్తింపు

అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది. మదనపల్లెలో ఏడేళ్ల బాలిక మిస్సింగ్ మిస్టరీ విషాదాంతమైంది. కులవర్ధన్‌ అనే వ్యక్తి ఇంట్లో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. పాప ఇంటికి సమీపంలోనే అతడి ఇల్లు కూడా ఉంది. పాపం బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. మదనపల్లె వన్‌టౌన్ పోలీసులు నిందితుడు కులవర్ధన్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే నిందితుడు కులవర్ధన్ గతంలో కూడా స్థానిక మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

మదనపల్లిలో భార్యాభర్తలు నివాసం ఉంటున్నాడు.. వారికి ఏడేళ్ల కుమార్తె ఉంది. సోమవారం సాయంత్రం బాలిక కనిపించకుండా పోయింది. తల్లిద్రండులు బాలిక కోసం గాలించారు.. ఆచూకీ దొరక్కపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని పోలీసులు గాలించినా చిన్నారి ఆచూకీ దొరకలేదు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పాపను ఇంటికి దగ్గరలోనే నివాసం ఉంటున్న కులవర్ధన్ దారుణంగా చంపి డ్రమ్ములో కుక్కినట్లు గుర్తించారు. కుమార్తె చనిపోయిందని తెలిసి తల్లిదండ్రులు కన్నీటిపర్యంతం అయ్యారు. పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పాప మరణంతో స్థానికంగా విషాద చాయలు అలముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది.

మదనపల్లెలో బాలుడిపై కుక్కల దాడి

మదనపల్లెలో బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. రెండేళ్ల బాలుడు వీధిలో ఆడుకుంటున్న సమయంలో కుక్కలు మీదపడ్డాయి.. ఈ ఘటనలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. మదనపల్లె కొత్తవారిపల్లె పంచాయతి పాళ్యం కొండలో సురేష్‌ దంపతులు నివాసం ఉంటున్నాడు. వారి కుమారుడు యశ్విన్‌‌కు రెండేళ్లు.. ఇంటికి దగ్గరలో వీధిలో ఆడుకుంటున్నాడు. అయితే అదే వీధిలో నివాసం ఉండే చంద్ర కుక్కల్ని పెంచుకుంటున్నాడు.. అవి ఒక్కసారిగా బాలుడిపై దాడి చేశాయి. బాలుడి కేకలు విన్న తల్లిదండ్రులు బయటకు వెళ్లి కుక్కల్ని తరిమేశారు. బాలుడు తీవ్రంగా గాయపడగా వెంటనే మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. బాలుడిక ప్రాణాపాయం తప్పిందని డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

  Last Updated: 17 Feb 2026, 11:15 AM IST