Site icon HashtagU Telugu

PM Modi : ప్రధాని మోడీ అమరావతి పర్యటన షెడ్యూల్ ఖరారు

Prime Minister Narendra Modi Ap Visit Amaravati Visit Tour Andhra Pradesh

PM Modi : ప్రధానమంత్రి నరేంద్రమోడీ అమరావతి పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఆయన మే 2న అమరావతిలో పర్యటించనున్నారు. ప్రధానమంత్రి 15 నిమిషాల పాటు రోడ్ షోలో పాల్గొంటారు. గంట పాటు సభలో ఉంటారు. ఈ పర్యటనలో భాగంగా మే 2న (శుక్రవారం) మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి ప్రధాని మోడీ చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 3.30 గంటలకు అమరావతిలోని హెలీప్యాడ్‌కు వెళ్తారు. హెలీప్యాడ్ నుంచి ప్రధాన వేదిక వరకు 1.1 కి.మీ మేర రోడ్ షోలో మోడీ పాల్గొంటారు. ఈ రోడ్ షో 15 నిమిషాలపాటు కొనసాగుతుంది.

Also Read :DC vs RCB: ప్ర‌తీకారం తీర్చుకున్న బెంగ‌ళూరు.. ఢిల్లీపై ఆర్సీబీ ఘ‌న‌విజ‌యం!

షెడ్యూల్ ఇలా.. 

Also Read :Ginger Water: అల్లం ముక్కను నీటిలో మరిగించి ప్రతిరోజూ తాగితే ఆ స‌మ‌స్య‌లు దూరం..

మోడీ పర్యటనకు ఏర్పాట్లు 

  • ఈరోజు రాత్రికల్లా అమరావతిలోని సభా ప్రాంగణం వద్ద  పనులన్నీ పూర్తి అవుతాయి.  అనంతరం ఈ ప్రాంగణాన్ని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు (ఎస్పీజీ)కు అప్పగిస్తారు.
  • స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు (ఎస్పీజీ) అనే విభాగం ప్రధానమంత్రి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంది.
  • బుధవారం రోజు  అమరావతిలోని సభా ప్రాంగణం వద్ద ఎస్పీజీ విభాగం ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తుంది.
  • సభా ప్రాంగణానికి 8 మార్గాల నుంచి చేరుకునేలా రహదారులను సిద్ధం చేస్తున్నారు.