ఏపీలో పాఠశాలలకు ఈ నెల 12 నుంచి సంక్రాంతి సెలవులు (Sankranti Holidays) ప్రారంభంకానున్నాయి. కనుమ రోజుతో కలిపి మొత్తం ఏడు రోజులు సెలవులుంటాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్కుమార్ శనివారం ఉత్తర్వులు విడుదల చేశారు. సెలవుల మార్పు కోసం ఉపాధ్యాయ సంఘాలు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణను అభ్యర్థించడంతో ఈ సవరణ జరిగింది. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేస్తూ ఒక సెలవు దినాన్ని పరిహార పని దినంగా పరిగణిస్తామని తెలిపారు.
Also Read: Bathroom Tips : మీ బాత్రూమ్ లో ఎలిగెంట్ లుక్ కోసం ఈ టిప్స్ పాటించండి..!
అంతకుముందు జనవరి 11 నుండి 16 వరకు ఆరు రోజులు సెలవు షెడ్యూల్ ఉండేది. దీంతో కనుమతో కలిపి ఈ నెల 12 నుంచి 18వ తేది వరకు (7 రోజులు) సెలవులుగా ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అదనంగా ఇచ్చిన కనుమ రోజు సెలవును మరో సెలవు రోజులో పాఠశాల నిర్వహించి భర్తీ చేయాలని పేర్కొంది. అంతకుముందు జనవరి 11 నుండి 16 వరకు ఆరు రోజులు సెలవు షెడ్యూల్ ఉండేది. ఇంతలో ఇతర ఉపాధ్యాయ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. షెడ్యూల్ను ఆలస్యంగా సవరించడం వల్ల తమ ప్రయాణ ప్రణాళికలకు ఆటంకం కలుగుతుందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.