తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మీద సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ విషం(RGV Vyuham Teaser) చిమ్ముతుంటారు. ఆయన ట్వీట్లు, మాటలు, సినిమాల ద్వారా నారా కుటుంబాన్ని చీల్చిచెండాడతారు. అధికారంలోకి చంద్రబాబు రాకుండా తన వంతు సహాయం జగన్మోహన్ రెడ్డికి చేస్తుంటారు. గత ఎన్నికల్లో కమ్మ రాజ్యంలో కడప రెడ్లు, లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాల ద్వారా చంద్రబాబును రాజకీయ విలన్ గా చిత్రీకరించారు. ఇప్పుడు వ్యూహం పేరుతో రెండు భాగాలుగా సినిమా తీస్తోన్న ఆయన మొదటి భాగం సినిమా ట్రైలర్ విడుదల చేశారు. దాంట్లో రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం తెలిసిన తరువాత చంద్రబాబు నవ్వుతున్నట్టు చూపడం టీడీపీ వర్గాలకు చిర్రెత్తిస్తోంది.
ట్రైలర్ ను ఎనిమిది భాగాలు షూట్ చేసిన ఆయన కేవలం మ్యూజిక్ అండ్ ఎమోషన్స్ ను (RGV Vyuham Teaser) చూపారు. చివరిలో మాత్రం ` నేను చంద్రబాబును కాను వినడానికి..` అంటూ ఒక డైలాగ్ ను పెట్టారు. ఈ ట్రైలర్ సినీ మరియు రాజకీయ వర్గాల్లో చర్చలకు దారితీసింది. రీసెంట్గా మరోసారి ప్రేక్షకులను కట్టిపడేసేలా ‘వ్యూహం’, ‘శపథం’ అనే రెండు కొత్త సినిమాలను ప్రకటించారు ఆర్జీవీ. ‘వ్యూహం’ రెండు భాగాలుగా ప్రదర్శించబడుతుంది, మొదటిది వైఎస్ఆర్ మరణానంతర సంఘటనలతో, రెండవది జగన్ ముఖ్యమంత్రి అయ్యే ప్రయాణాన్ని (RGV Vyuham Teaser) స్టోరీ లైన్ గా తీసుకుని నిర్మించారు.
‘వ్యుహం’ షూటింగ్తో వేగంగా ముందుకు సాగుతోంది. సినిమాలోని ప్రధాన పాత్రలను ట్రైలర్ లో పూర్తిగా చూపించడం అభిమానులను ఆకట్టుకున్నాడు. ఆర్జీవీ ‘వ్యూహం’ టీజర్ను ఆవిష్కరించారు. వైఎస్ఆర్ అనంతర కాలంలోని ఒక సంగ్రహావలోకనం అందిస్తుంది. అందులో వివిధ వ్యక్తుల ప్రతిచర్యలు, జగన్ అరెస్టు దృశ్యాలు, అతని రాజకీయ పార్టీ ఉన్నాయి. జగన్ పవర్ ఫుల్ డైలాగ్ తో టీజర్ ముగిసింది. మొత్తం మీద చంద్రబాబును టార్గెట్ చేస్తూ ఆర్జీవీ సినిమాల.(RGV Vyuham Teaser) ద్వారా ఎన్నికలకు సిద్ధమవుతున్నారు.
‘అలా ఆలోచించడానికి చంద్రబాబుని కాదు’ అని జగన్ చెప్పే డైలాగ్ తో టీజర్ ముగుస్తుంది. 2.46 నిమిషాల నిడివి ఉన్న టీజర్ లో ఈ ఒక్క డైలాగ్ మాత్రమే ఉంది. ట్రైలర్ లో వైఎస్ భారతి పాత్రను పోషించిన నటి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆమె ఎవరో కాదు వర్ధమాన మలయాళ నటి మానస రాధాకృష్ణన్. ఆమె ఇప్పటికే తెలుగులో ఒక సినిమా చేసింది. ఆనంద్ దేవరకొండ చిత్రం ‘హైవే’లో మూవీలో మానస నటించింది. విజయమ్మ పాత్రలో సురభి ప్రభావతి నటించారు.
Also Read : RIP RGV : జగన్ కు వర్మ, శ్రీరెడ్డి జై! స్లీపర్ సెల్స్ తరహాలో సోషల్ సెల్స్ !
పలు సందర్బాల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ను ఆర్జీవీ సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డికి మద్ధతుగా నిలిచారు. కేవలం ఆర్థిక పరమైన సంబంధాల కారణంగా ఆర్జీవీ ఇలా సినిమా తీస్తున్నారా? లేక చంద్రబాబు మీద వ్యక్తిగత కక్ష్యా? అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో ఆయన సినిమా ప్రభావం ఎంతో కొంత ఓటర్ల మీద పడింది. సామాజికవర్గాల పరంగా విడదీసి కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాను నిర్మించారు. స్వర్గీయ ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన ఘట్టాన్ని హైలెట్ చేస్తూ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తీశారు. ఆ రెండు సినిమాలు ఏపీ ప్రజలు ఆదరించడం గమనార్హం.
Also Read : RGV : సీఎం జగన్తో మరోసారి ఆర్జీవీ భేటీ.. ఆ సినిమా కోసమేనా?
సినీ పరిశ్రమకు టీడీపీకి మంచి సంబంధాలు ఉన్నాయి. కానీ, ఎవరూ చంద్రబాబుకు అనుకూలంగా సినిమాలు నిర్మించడానికి ముందుకు వచ్చిన దాఖలాలు లేవు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సినిమాలు తీయడానికి ఏ డైరెక్టర్ ముందుకు రారు. హెలికాప్టర్ ప్రమాదం జరిగిన తరువాత జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరును వెండి తెరకు ఎక్కించడానికి ఎవరూ సాహసం చేయలేరు. వైఎస్ కుటుంబలోని విభేదాలను బేస్ చేసుకుని సినిమా తీయడానికి ఏ డైరెక్టర్ కు ధైర్యం లేదు. కానీ, చంద్రబాబునాయుడు మీద ఎన్ని సినిమాలు తీయడానికైనా ఆర్జీవీ ముందుకొస్తారు. ఆయనకు పెట్టుబడి పెట్టడానికి వైసీపీ నాయకులు చాలా మంది ఉన్నారు. అదే, టీడీపీ, వైసీపీ మధ్య ఉన్న వ్యత్యాసం. అందుకే, ఆర్జీవీ అవకాశాలను (RGV Vyuham Teaser) అందిపుచ్చుకుంటున్నారు.
Also Read : Target RGV : కులాల కుంపటిపెట్టిన వర్మ! `రిప్` పై కాపు జాతి రివర్స్ !