AP Ministers: మంత్రుల రాజీనామా మూడ్

మంత్రి ధర్మాన రాజీనామా కలకలం రేపుతోంది. ముఖ్యమంత్రి నివారించినప్పటికీ ఉత్తరాంధ్రా వైసీపీ లీడర్లు దూకుడుగా వెళ్తున్నారు.

  • Written By:
  • Updated On - October 22, 2022 / 03:57 PM IST

మంత్రి ధర్మాన రాజీనామా కలకలం రేపుతోంది. ముఖ్యమంత్రి నివారించినప్పటికీ ఉత్తరాంధ్రా వైసీపీ లీడర్లు దూకుడుగా వెళ్తున్నారు. మూడు రాజధానుల అంశంను మరింత వేడెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపీలో రాజీనామాల ఎపిసోడ్ పుంజుకుంది. ఇప్పటికే విశాఖ జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ  రాజీనామా చేశారు. అయితే స్పీకర్ ఫార్మాట్లో లేకపోవడంతో ప్రత్యర్థుల విమర్శలకు దారితీసింది.   మరోవైపు అమరావతి రైతులు చేస్తున్న మహాపాదయాత్ర 2.0ను నిలువరించాలని వైసీపీ ఉత్తరాంధ్ర నాయకులు సవాల్ గా తీసుకున్నారు. ఈ క్రమంలోనే హైకోర్టుకు కూడా వెళ్లారు. హైకోర్టు మాత్రం నిలుపుదలకు ఏమాత్రం అంగీకరించలేదు. రైతుల పాదయాత్ర అత్యంత వేగంగా ఉత్తరాంధ్ర దిశగా సాగిపోతోంది. ఈ నేపథ్యంలో దీనిని ఏదో ఒక విధంగా అడ్డుకుని తీరాలనేది వైసీపీ వ్యూహం. రాజమండ్రిలో అడ్డుకునే  ప్రయత్నించారు. దానిపై హైకోర్టు సీరియస్ అయింది.

ప్రజల్లో సెంటిమెంటునురగిలించడం ద్వారా రైతులకు నిరసన తెలిపేలా వైసిపి ప్లాన్ చేసింది. ఆ క్రమంలోనే బొత్స సత్యనారాయణ పార్టీ శ్రేణులు, ప్రజలకు మూడు రాజధానుల ప్రాధాన్యం వివరించాలని సూచించారు.రైతులు చేస్తున్న పాదయాత్రకు నిరసనగా వారు ప్రయాణించే మార్గాల్లో బంద్ పాటించాలని,  బైకు ర్యాలీలు నిర్వహించి నిరసన తెలపాలని పిలుపు ఇచ్చారు. ఇక ధర్మాన ప్రసాదరావు ఏకంగా మంత్రి పీఠాన్ని వదులుకునేందుకు రెడీ అయ్యారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ  తాజాగా సీఎం ముందు ప్రతిపాదన పెట్టారు. దీనికి సీఎం ఒప్పుకోలేదని సమాచారం.మరో మంత్రి శ్రీకాకుళానికి చెందిన  సీదిరిఅప్పలరాజు కూడా తన పదవికి రాజీనామా చేయాలని యోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలను గమనిస్తే నిజంగానే  రాజీనామాలు చేస్తారా?  లేక ఈ ప్రకటనలకు , లీకులకు పరిమితం అవుతారా ? అనే సందేహం కలుగుతోంది. రాజకీయ వేడి పుట్టించాలనే వ్యూహం ఏదైనా ఉందా? అనే అనుమానాలకు దారితీస్తుంది. ఉత్తరాంధ్రలో ఇప్పుడు రాజకీయ అలజడి ప్రారంభమైంది.