ఏపీలో ఎన్నికల హడావిడి ఏ రేంజ్ లో ఉందో చెప్పాల్సిన పనిలేదు. కూటమి , వైసీపీ , కాంగ్రెస్ వంటి ప్రధాన పార్టీలు బరిలో ఉన్నప్పటికీ పోటీ మాత్రం కూటమి vs వైసీపీ మద్యే నడుస్తుంది. ఈసారి గెలుపు మాదంటే మాదే అంటూ ఈ రెండు పార్టీలు పోటీ పోటీగా ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా బరిలో ఉన్నప్పటికీ ప్రధానంగా షర్మిల పోటీ చేస్తున్న కడప లోక్ సభ స్థానం పైనే ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ నుండి షర్మిల పోటీ చేస్తుండగా..వైసీపీ నుండి అవినాష్ రెడ్డి బరిలో ఉన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ప్రస్తుతం షర్మిల ప్రచారం మొత్తం కూడా వివేకా హత్య పైనే చేస్తూ జగన్ , అవినాష్ రెడ్డి లపై విరుచుకుపడుతుంది. ఇప్పటివరకు షర్మిల మాత్రమే రాష్ట్రం మొత్తం చుట్టేస్తుండగా..ఇక ఇప్పుడు షర్మిల తరుపున ప్రచారం చేసేందుకు రాహుల్ రాబోతున్నాడు. సరిగ్గా ఎన్నికలకు ఒక రోజు ముందు అంటే మే 11 ఆయన ప్రచారం చేయబోతున్నారు. మే 11 న కడప లో షర్మిల తరుపున రాహుల్ ప్రచారం చేయబోతున్నారు. ఈసారి కడప లో షర్మిల విజయం ఖాయమని అంత చెపుతున్నారు. మరి రాహుల్ తన ప్రసంగం లో ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో చూడాలి.
Read Also : Amit Shah to Rahul Gandhi: రాహుల్ అమ్మమ్మ వచ్చినా CAA ఆగదు: అమిత్ షా