RRR : కూటమి నుండి ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు ప్రకటించిన రఘురామ

నర్సాపురం నుంచి ఎంపీగా మళ్లీ బరిలోకి దిగుతానని రఘురామకృష్ణరాజు తాడేపల్లి గూడెం వేదికగా ప్రకటించారు.రీసెంట్ గా వైసీపీ (YCP) కి రాజీనామా చేసిన ఎంపీ రఘురామ కృష్ణం రాజు (Raghurama Krishnamraju)..ఇప్పుడు టీడీపీ (TDP) – జనసేన (Janasena) కూటమి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నాడు. 2019 ఎన్నికల్లో న‌ర‌సాపురం పార్లమెంటు స్థానం (Narsapuram MP Seat) నుంచి వైసీపీ తరపున ర‌ఘురామ‌కృష్ణరాజు పోటీ చేసి విజయం సాధించారు. ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ, జ‌న‌సేన పార్టీలు విడివిడిగా […]

Published By: HashtagU Telugu Desk
Rrr Janda

Rrr Janda

నర్సాపురం నుంచి ఎంపీగా మళ్లీ బరిలోకి దిగుతానని రఘురామకృష్ణరాజు తాడేపల్లి గూడెం వేదికగా ప్రకటించారు.రీసెంట్ గా వైసీపీ (YCP) కి రాజీనామా చేసిన ఎంపీ రఘురామ కృష్ణం రాజు (Raghurama Krishnamraju)..ఇప్పుడు టీడీపీ (TDP) – జనసేన (Janasena) కూటమి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నాడు. 2019 ఎన్నికల్లో న‌ర‌సాపురం పార్లమెంటు స్థానం (Narsapuram MP Seat) నుంచి వైసీపీ తరపున ర‌ఘురామ‌కృష్ణరాజు పోటీ చేసి విజయం సాధించారు. ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ, జ‌న‌సేన పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. జనసేన తరపున కొణిదెల నాగ‌బాబు, టీడీపీ తరపున వేటుకూరి వెంక‌ట శివ‌రామ‌రాజు బరిలో నిలిచారు. అయితే వైసీపీ అభ్యర్థిగా రఘురామ 31,909 ఓట్ల మెజారిటీతో విజ‌యం సాధించారు. ఆ తవ్రతః వైసీపీ నేతలకు, ఆయ‌న‌కు మ‌ధ్య విభేదాలు తలెత్తాయి. ఇలా ఏర్పడిన విభేదాలు తారాస్థాయికి చేరడంతో ఆయన పార్టీకి దూరమయ్యారు. త‌న ఐదేళ్ల ప‌ద‌వీ కాలంలో 4 ఏళ్ల పాటు రెబ‌ల్‌గానే ఉన్నారు. ఇక రీసెంట్ గా వైసీపీ కి రాజీనామా చేసిన రఘురామ..ఇప్పుడు టీడీపీ నుండి బరిలోకి దిగబోతున్నాడు. ఈ విషయాన్నీ ఈరోజు తాడేపల్లిగూడెంలో జరిగిఆన్ టీడీపీ-జనసేన ఉమ్మడి సభలో ఈ వెల్లడించారు.

We’re now on WhatsApp. Click to Join.

సభ వేదికపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమక్షంలోనే రఘురామకృష్ణ తనపై పోటీపై స్పష్టమైన ప్రకటన చేశారు. అంటే ఆయనకు ఎంపీ సీటు ఖాయమైందని తేలిపోయింది. కానీ ఏ పార్టీ నుంచి అనేది తేలాల్సి ఉంది. ఏ పార్టీలోనూ ఇంకా చేరకున్నా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం జరుగుతున్న ప్రయత్నంలో భాగమయ్యేందుకు తాడేపల్లిగూడెం సభకు వచ్చానని రఘురామ చెప్పుకొచ్చారు. ఈ సందర్బంగా సీఎం జగన్ ను ఉద్దేశించి సభా వేదికపై రఘురామ ఘాటు విమర్శలు గుప్పించారు. ఏపీని సర్వనాశనం చేసిన నాయకుడిని గద్దె దించాల్సిందేనని స్పష్టంచేశారు.

Read Also : Pawan Kalyan : నాతో స్నేహం అంటే చచ్చేదాక – పవన్ కళ్యాణ్

  Last Updated: 28 Feb 2024, 11:04 PM IST