Site icon HashtagU Telugu

PM Modi : ఈ నెల 29న విశాఖకు ప్రధాని మోడీ

Modi

Modi

ప్రధాని మోడీ (PM Modi ) ఈ నెల 29 న వైజాగ్ (Vizag) కు రాబోతున్నారు. ఈ పర్యటనలో వర్చువల్గానే మోదీ ఎన్టీపీసీ రూ.80వేల కోట్ల పెట్టుబడులతో స్థాపించనున్న గ్రీన్‌ అమ్మోనియా, గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌లతోపాటు గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్కులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే సాయంత్రం ఏయూ మైదానంలో జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారికంలోకి వచ్చిన తరువాత ప్రధాని పాల్గొంటున్న తొలి అధికారిక కార్యక్రమం కావటంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో ఇప్పటికే 1200 ఎకరాలు కేటాయించింది. గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌లో 20 గిటావాట్‌ల విద్యుత్తును ఎన్టీపీసీ ఉత్పత్తి చేయనుంది. ఈ రెండు భారీ ప్రాజెక్టుల వల్ల నాలుగేళ్లలో 48వేల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. అమరావతి పనులు వచ్చే నెల నుంచి ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అదే సమయంలో కేంద్ర మంత్రివర్గం అమరావతి కి 54 కిలో మీటర్ల మేర కొత్త రైల్వే లైన్ కు ఆమోదం తెలిపింది. ఈ పనుల ప్రారంభం ప్రధానితో చేయించాలని చంద్రబాబు కోరుతున్నారు.

ఇక కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి ఏపీకి వరుస గుడ్ న్యూస్ లు అందజేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపిన మోడీ..ఆ హామీ ప్రకారం ఏపీకి అందాల్సిన నిధులు , పోలవరం ప్రాజెక్ట్ పూర్తి , పెండింగ్లో ఉన్న పనులు ఇవన్నీ త్వరగా పూర్తి అయ్యేలా దృష్టి పెట్టారు. ఇక సీఎం చంద్రబాబు సైతం కేంద్ర మంత్రులతో ఎప్పటికప్పుడు సమావేశలవుతూ వస్తున్నారు.

Read Also : Voters: ప్రజాస్వామ్యంలో ఓటర్లు ఎలాంటి నాయకులను ఇష్టపడుతున్నారు?