Site icon HashtagU Telugu

Gannavaram: ప్రాణం తీసిన ఫొటోషూట్, గన్నవరంలో చెరువులో ఇద్దరు యువకులు గల్లంతు

Crime

Crime

Gannavaram: రోజురోజుకూ సోషల్ మీడియా వాడకం పెరగడంతో యువత కూడా గంటలకొద్దీ సోషల్ మీడియాలో గడుపుతోంది. లైక్స్, కామెంట్స్ క్రేజ్ లో పడి ఫొటోషూట్ అంటూ ప్రమాదకరంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు విద్యార్థులు ఫొటోషూట్స్ కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో గన్నవరం సమీపంలోని చెరువులో ఆదివారం మధ్యాహ్నం ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ పటమటకు చెందిన ఆరుగురు స్నేహితులు కృష్ణా జిల్లా గన్నవరం మండలం సవారిగూడెంలోని బాపట చెరువు వద్ద ఫొటోషూట్ కోసం వెళ్లారు. ఆరుగురు స్నేహితులలో, ఇద్దరు నీటిలోకి దిగారు, మిగిలిన నలుగురు, ఎ. రాజా రెడ్డి, విక్రమ్ అభినవ్ చౌదరి, ఎం. శ్రాయేస్ మరియు ఎన్. గౌతం సరస్సు ఒడ్డున కూర్చుని ఫోటోలు తీస్తున్నారు.

అకస్మాత్తుగా సరస్సులోకి దిగిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు యువకులు చనిపోవడంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. సోషల్ మీడియాలో ఉచ్చులో పడి ప్రాణాలు తీసుకోవద్దని పోలీసులు చెబుతున్నారు.

Also Read: KTR: ప్రైవేట్ టీచర్స్ ఫోరంతో కేటీఆర్ భేటీ, ఓటుబ్యాంక్ పై గురి